E-Paper
Advertisement

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి
Advertisement

Congress : మూసీలో మూడు రోజులు ఉండమంటే, బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. మూసీ ఒడ్డున ఉండేవారికి మంచి బతుకు ఇవ్వాలని తాము ప్రయత్నిస్తుంటే, ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఢిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే కవితకు బెయిల్ వచ్చిందా? అంటూ సెటైర్లు వేశారు. హైదరాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పారు. 24 గంటలపాటు ట్వీట్లు చేస్తేనో, సినిమా వాళ్లతో సంబంధాలు ఉంటేనో నాలెడ్జ్ ఉన్నట్టు కాదు డ్రామారావు అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు చామల. కేటీఆర్ ఆన్‌లైన్, బీఆర్ఎస్ ఆఫ్‌లైన్, కేసీఆర్ ఫ్లైట్ మోడ్ అంటూ చురకలంటించారు. పొద్దున బావ హరీష్ రావు మధ్యాహ్నం బావమరిది కేటీఆర్ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Advertisement

ALSO READ:ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తానని మాయమాటలు చెప్పింది ఎవరో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ లాగా, రేవంత్ రెడ్డి మాయమాటలు మాట్లాడటం లేదని చెప్పారు. లక్షన్నర కోట్లు అనే పదాన్ని పట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, పది నెలల కాంగ్రెస్ పాలనకు మధ్య యుద్ధం జరుగుతోందని, సీఎం రేవంత్ రెడ్డి మూసీకి పునరుజ్జీవం తీసుకురావాలని చూస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించిన చామల, పేదలు మురికి కూపంలోనే బతకాలా అని ప్రశ్నించారు.

Advertisement

భువనగిరి ప్రజలకు మూసీ జీవ నది అని పేర్కొన్నారు. మూసీ నీళ్ల వలన మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేదని, ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్, బీజేపీ అభిప్రాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీని వ్యతిరేకించే నాయకుల లాగు ఉడబీకుతామన, రోడ్లమీద తిరగనియ్యమని, ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు, ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మూసీ ప్రక్షాళన అవసరం లేదంటే అక్కడ ఉండి ఆ నీళ్లతో స్నానం చేయాలన్నారు. వాసన రాకుంటే ప్రక్షాళన అవసరం లేదని చెప్పారు. ఈటల బీజేపీలోకి పోయి కలుషితం అయ్యారని, పాత బాస్‌లు కేసీఆర్, కేటీఆర్‌లను ఆయన అనుసరిస్తున్నారని మండిపడ్డారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×