E-Paper
Advertisement

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ
Advertisement

Modi : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ను మోదీ సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ పనులు, బోధన్‌-బాసర-భైంసా హైవే పనులకు, సిరొంచా – మహాదేవ్‌పూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పథం
ఎరువుల కర్మాగారం, రైల్వేలైన్‌, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. కొత్త ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. ప్రపంచలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని ప్రకటించారు. 8 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచామన్నారు. శంకుస్థాపనలకే పరిమితం కాలేదు వాటిని వేగంగా పూర్తి చేసి చూపించామని మోదీ స్పష్టం చేశారు.

Advertisement

భారత్ యూరియా బ్రాండ్
యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని మోదీ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామన్నారు. 5 ప్రాంతాల్లో ఎరువుల కర్మాగారాల ఏర్పాటుతో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. నానో యూరియా టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు మోదీ. బీజేపీ అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చేశామన్నారు. భవిష్యత్‌లో భారత్‌ యూరియా పేరిట ఒకటే బ్రాండ్‌ తెస్తామన్నారు.

సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ
సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని వెల్లడించారు. మెజార్టీ వాటా రాష్ట్రానిదే అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రధాని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×