E-Paper
Advertisement

Kavitha: ఈడీ విచారణకు హాజరైన కవిత.. అరుణ్ పిళ్లైతో కలిసి ప్రశ్నించే అవకాశం..

Kavitha: ఈడీ విచారణకు హాజరైన కవిత.. అరుణ్ పిళ్లైతో కలిసి ప్రశ్నించే అవకాశం..
Advertisement

Kavitha: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా?.. కారా?.. అనే ప్రశ్నకు తెర పడింది. ఎట్టకేలకు రెండో సారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కేవలం కవితను మాత్రం ఈడీ ఆఫీస్‌లోకి అనుమతించారు. వెంట వచ్చిన కవిత భర్త అనిల్, న్యాయవాది సోమభరత్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లను లోపలికి అనుమతించ లేదు.

ఇక ఆఫీసులోకి వెళ్తున్న క్రమంలో కవిత చిరునవ్వుతో పిడికిలి బిగింది అభిమానులకు అభివాదం చేశారు. ధైర్యంగా కవిత ఆఫీసులోకి వెళ్లారు. ఆమె భర్త దగ్గరుండి భుజం తట్టి ఈడీ కార్యాలయంలోకి పంపించారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారించే అవకాశం ఉంది.

Advertisement

ఇక మార్చి 11న మొదటిసారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ మార్చి 16న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులిచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పెండింగ్‌లో ఉండడంతో మార్చి 16వ తేదీన కవిత విచారణకు హాజరుకాలేదు. ఆమె తరుపున న్యాయవాదులను పంపించారు. ఈక్రమంలో 20వ తేదీన మళ్లీ హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×