E-Paper
Advertisement

ED Inquiry : ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ… నెక్ట్స్ ఎవరు?

ED Inquiry : ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ… నెక్ట్స్ ఎవరు?
Advertisement

ED Inquiry : చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దూకుడు పెంచింది. రాజకీయ నేతలే టార్గెట్ గా విచారణ కొనసాగిస్తోంది. రెండో విడత విచారణలో టీఆర్ఎస్ నేతలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ , ధర్మేంద్ర యాదవ్ , ఎమ్మెల్సీ ఎల్ . రమణను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇప్పుడు మరికొందరిపై ఫోకస్ పెట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్‌ను విచారిస్తున్నారు. ఈడీ నోటీసులు ఇవ్వడంతో హరీష్ హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. బ్యాంక్ స్టేట్ మెంట్ లతో విచారణకు హాజరయ్యారు.

నిందితులు విదేశాల్లో క్యాసినో ఆడేందుకు హవాలా మార్గంలో డబ్బును తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తలసాని మహేష్, తలసాని ధర్మేంద్ర యాదవ్‌ను విచారించిన అధికారులు వారిచ్చిన సమాచారం ఆధారంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. క్యాసినో కేసులో తొలివిడతలో టూర్ ఆపరేటర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. 3 నెలల క్రితం చాలామంది టూర్ ఆపరేటర్లను విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా తాజాగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పుడు ఈడీ ప్రశ్నిస్తున్న వారిలో టీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. తలసాని పీఏ హరీష్ ఇచ్చే స్టేట్ మెంట్‌ ఈ కేసులో కీలకంగా మారనుంది.

Advertisement

ఈడీ రెండో విడత విచారణలో టీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులే ఉన్నారు. ఈడీ నెక్ట్స్ టార్గెట్ ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఎక్కడ తమకు నోటీసులు అందుతాయో అన్న ఆందోళన చాలామంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×