E-Paper
Advertisement

వికలాంగుల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

వికలాంగుల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
Advertisement

దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో బతకాలనే ఏకైక లక్ష్యంతో ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి వికలాంగుడికి వారి పేరు మీదనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. బుధవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి పద్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేదికపై 140 మంది లబ్ధిదారులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఇందులో ప్రధానంగా 75 మందికి స్కూటీలు అందజేశారు. మిగిలిన వారికి బ్యాటరీ వీల్ చైర్లు, బిజినెస్ ఎంపవర్ కార్ట్స్, లాప్టాప్‌లు పంపిణీ చేసి వారిలో భరోసా నింపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. నిరుద్యోగ దివ్యాంగుల ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకంగా జాబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంగ వైకల్యం నిర్ధారణ ప్రక్రియను మరింత శాస్త్రీయంగా చేసేందుకు అత్యాధునిక పరికరాల కొనుగోలు నిమిత్తం 20 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి వచ్చే బడ్జెట్‌లో మరిన్ని స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ సంస్థ ద్వారా అమలవుతున్న పథకాలను వివరించారు. ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, పైడి రాకేష్ రెడ్డితో పాటు నగర మేయర్ ఉమారాణి ఈ పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ దిలీప్ కుమార్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అన్వేష్ రెడ్డి, తాహిర్ బిన్ హందాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పరికరాల ద్వారా తమ జీవనోపాధి మెరుగుపడుతుందని లబ్ధిదారులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దివ్యాంగుల కోటాలో మరిన్ని సంక్షేమ ఫలాలను అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

ALSO READ: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్.. అన్నివర్గాలకు మోసం జరిగిందని వ్యాఖ్య

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×