E-Paper
Advertisement

Konda Surekha on KTR: మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్.. ఎందుకు అధికారులను దేశం దాటించారు?

Konda Surekha on KTR: మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్.. ఎందుకు అధికారులను దేశం దాటించారు?
Advertisement

Konda Surekha on KTR: మంత్రి కొండా సురేఖ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఈసారి బీఆర్ఎస్ వ్యవహారశైలిపై దుమ్మెత్తి పోశారు. నాలుగైదు అంశాలపై బీఆర్ఎస్ నేతలను ఆమె చీల్చిచెండారారు. తొలుత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నోరు ఎత్తారు.

బీఆర్ఎస్ నేతల హస్తం లేకపోతే ఆఫీసర్లను ఎందుకు దేశం దాటించారని ప్రశ్నించారు. చేసేది న్యాయమే అయితే సోషల్‌మీడియాను వేరే దేశం నుండి నడపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. మా ప్రభుత్వం రీవేంజ్ తీర్చుకునేలా ఉంటే ఈపాటికి బీఆర్ఎస్ నేతలంతా జైల్లో ఉండేవాళ్ళు వారని గుర్తు చేశారు.

Advertisement

తెలంగాణ తల్లిని దొరసాని మారిదిగా చేస్తామని బీఆర్ఎస్ ప్రగల్భాలు పలికిందని, బంగారు ఆభరణాలు, వడ్డానాలు పెట్టి తెలంగాణ తల్లిని తయారు చేస్తామని చెప్పారని ఎక్కడని అన్నారు. సబ్బండ వర్గాల ప్రతినిధిగా తయారు చేశారని రుసరుసలాడారు.

బీఆర్ఎస్ ఉచ్చులో యువతకు సూచన చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు ప్రజలు గుర్తుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, నిరుద్యోగం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని గుర్తు చేశారు.

Advertisement

ALSO READ: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్

కౌశిక్ రెడ్డి ఓ పిచ్చోడని, అసెంబ్లీకి వస్తే గొడవ చేస్తాడని.. మెదడు లేకుండా ఏదో మాట్లాడతాడని ఆగ్రహించారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న కేటీఆర్ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడే దరిద్రమైన భాష వాళ్ళ నాన్న (కేసీఆర్) ఎన్నడూ మాట్లాడలేదన్నారు.

తెలంగాణ వస్తుందని తెలిసి అమెరికా నుండి తట్ట బుట్ట సర్దుకుని వచ్చారని ధ్వజమెత్తారు మంత్రి. తెలంగాణ ఉద్యమం క్రెడిట్ కోసం నువ్వు, నీ చెల్లి రాష్ట్రానికి వచ్చారన్నారు. మాట్లాడితే ప్రభుత్వాన్ని పడగొడతామని చిలక పలుకులు పలుకున్నారని చెప్పుకొన్నారు.

యువత జీవితాలతో ఆడుకున్నది కేసీఆర్ అని, మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని, ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. మూసీ ఉద్యమం చేస్తామని కారు పార్టీ నేతలు చెబుతున్నారని, ఈసారి పెట్రోల్ బాటిల్ తెచ్చుకోవాలని, ప్రజలు అగ్గిపెట్టి ఇస్తారని చురక వేశారు.

బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే.. కాంగ్రెస్‌ను గెలిపించార న్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల గురించి రేవంత్‌రెడ్డి సర్కార్ ఆలోచన చేస్తోందన్నారు. గౌడ్ల భద్రత కోసం పరికరాలు అందించిన తొలి వ్యక్తి సీఎం రేవంత్ అని తెలియజేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×