E-Paper
Advertisement

నల్లమలలో మళ్ళీ కార్చిచ్చు.. ఫరాదాబాద్ చౌరస్తా వద్ద ఎగిసిపడుతున్న మంటలు!

నల్లమలలో మళ్ళీ కార్చిచ్చు.. ఫరాదాబాద్ చౌరస్తా వద్ద ఎగిసిపడుతున్న మంటలు!
Advertisement

Nallamala Fire: నల్లమల అభయారణ్యంలో మరోసారి అగ్నిప్రేళయం సృష్టించబడింది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలోని ఫరాదాబాద్ చౌరస్తా సమీపంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఎండ తీవ్రతకు తోడు ఎండుటాకులు, గడ్డి ఉండటంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదం కారణంగా అటవీ సంపదతో పాటు వన్యప్రాణుల మనుగడకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ప్రధాన రహదారికి సమీపంలోనే మంటలు ఉండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

సలేశ్వరం జాతర వేళ కలవరం.. అప్రమత్తమైన యంత్రాంగం
ప్రస్తుతం ప్రసిద్ధ సలేశ్వరం జాతర సమయం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మంటలు చెలరేగిన ప్రాంతం ఈ జాతర పరిసరాలకు సమీపంలోనే ఉండటంతో అటవీ శాఖ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జాతరకు వెళ్లే మార్గాల్లో మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ వాచర్లు, అటవీ సిబ్బంది క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతంలో నిప్పుతో కూడిన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

బూడిదవుతున్న పచ్చని అడవి..
గత కొన్ని రోజులుగా నల్లమల అడవుల్లో వరుసగా సంభవిస్తున్న ఈ ప్రమాదాలు ప్రకృతి ప్రేమికులను కలవరపెడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికే వందల హెక్టార్ల విస్తీర్ణంలో విలువైన అటవీ సంపద అగ్నికి ఆహుతైపోయింది. అరుదైన మూలికలు, వృక్షజాతులు బూడిదవుతుండగా, మంటల వేడికి తట్టుకోలేక వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నాయి. గాలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మంటలను అదుపులోకి తీసుకురావడం అధికారులకు సవాలుగా మారింది.

Also Read: ఇక సర్కారీ బడిలోనే ఎల్‌కేజీ, యూకేజీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

Advertisement

యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు..
మంటలను అదుపు చేసేందుకు అటవీ శాఖ అధికారులు అధునాతన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఫైర్ బ్లోయర్స్ సహాయంతో మంటలు మరింత వ్యాపించకుండా ‘ఫైర్ లైన్స్’ ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. అడవిని కాపాడుకోవడానికి స్థానిక ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా, మంటలు జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు రాత్రింబవళ్లు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×