E-Paper
Advertisement

Mallu Ravi : తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి.. కేంద్రాన్ని కోరిన మల్లు రవి..

Mallu Ravi : తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి.. కేంద్రాన్ని కోరిన మల్లు రవి..
Advertisement

Mallu Ravi : ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. డప్పు వాయిద్యాలతో తెలంగాణ భవన్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లు రవి తొలు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. స్టూడెంట్ లీడర్ గా మొదలుపెట్టి ఎంపీ స్థాయికి ఎదిగారు. 1991-96, 98-99 మధ్య నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్నారు.

Advertisement

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేశారు. ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పార్టీ కోసం పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇటీవల మల్లు రవిని సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు.

ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన ఏఐసీసీ పెద్దలకు మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి చెందిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 15
అంశాలపై ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని వివరించారు.సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మల్లు రవి కోరారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×