E-Paper
Advertisement

MALLAREDDY : ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై మల్లారెడ్డి రియాక్షన్ ఇదే..

MALLAREDDY : ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై మల్లారెడ్డి రియాక్షన్ ఇదే..
Advertisement

MALLAREDDY : ఐదుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై ఆచితూచిగా మాట్లాడారు. ఈ సమస్యను సామర్యంగా పరిష్కరించాలని యోచనలో మల్లారెడ్డి ఉన్నారు. ఈ ఇష్యూ చాలా చిన్నది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఎమ్మెల్యేలు తనపై చేసిన వ్యాఖ్యలను మీడియానే పెద్దదిగా చూపిందన్నారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ గల పార్టీ అని పేర్కొన్నారు. ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.

పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తప్ప తాను కాదు మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తాను గాంధేయవాదినని చెప్పుకొచ్చారు. ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదని తేల్చిచెప్పారు. తన జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మాట్లాడతానని తెలిపారు. అవసరమైతే వాళ్లందరినీ ఇంటికే ఆహ్వానిస్తానన్నారు. కావాలనే కొందరు సమస్యను పెద్దది చేసి చూపిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు.

Advertisement

పదవుల కేటాయింపు విషయంలో మల్లారెడ్డి వైఖరిపై అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడంతో వివాదం రాజుకుంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మల్లారెడ్డికి వ్యతిరేకంగా భేటీ అయ్యారు. మంత్రి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ నియోజకవర్గాల్లో తలదూర్చుతున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఆ ఐదుగురు ఎమ్మెల్యే వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో నిప్పు రాజేశాయి. దీనిపై మల్లారెడ్డి ఏవిధంగా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంలో మల్లారెడ్డి ఉన్నారని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. అసలే ఐటీ దాడులతో ఒకవైపు అల్లాడిపోతే..ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారింది. దీంతో రాజీ ధోరణిలో మల్లారెడ్డి ముందుకెళుతున్నారు. మరి ఆయన నిజంగా ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానించి సమస్యను పరిష్కరించుకుంటారా? లేక పోతే అధిష్టానం వద్దే తెల్చుకుంటారా చూడాలి మరి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×