E-Paper
Advertisement

Mallareddy : ఇలాంటి ఐటీ రైడ్స్ జీవితంలో చూడలేదు…అధికారులపై మల్లారెడ్డి ఫైర్

Mallareddy : ఇలాంటి ఐటీ రైడ్స్ జీవితంలో చూడలేదు…అధికారులపై మల్లారెడ్డి ఫైర్
Advertisement

Mallareddy : సోదాల సందర్భంగా విధులకు ఆటంకం కలిగించారన్న ఐటీ అధికారుల ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను సంతకం చేసిన తర్వాతే అధికారులు బయటకు వెళ్లారని తెలిపారు. ఎవరి విధులకు అడ్డుపడలేదని స్పష్టం చేశారు. వందకోట్లు బ్లాక్‌మనీ ఉన్నట్లు రాసి తన కొడుకుతో బలవంతంగా సంతకం చేయించారని మంత్రి ఆరోపించారు. కొడుకు సంతకం పెట్టిన ఫైల్స్‌ను చూపించడం లేదన్నారు. ఇలాంటి రైడ్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు చూపిస్తే ఫైన్‌ కడతామన్నారు. తాము దొంగలమా? ఇంత అరాచకమా? అని ప్రశ్నించారు. తన కొడుకును ఆస్పత్రిలో చేర్చినట్లు కూడా ఐటీ అధికారులు చెప్పలేదని మండిపడ్డారు.

Advertisement

ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ రైడ్స్‌ ఉంటాయని మల్లారెడ్డి అన్నారు. ఎన్ని రైడ్స్‌ జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఐటీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఇంత కుట్ర అవసరమా? బీజేపీ కుట్రలకు భయపడేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.

తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్‌ చేయాలనే ఐటీ దాడులు చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదవు చెప్పించామని తెలిపారు. ఇప్పటి వరకు తమపై 3సార్లు ఐటీ దాడులు జరిగాయని.. కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మెడికల్‌ సీట్లు అడ్మిషన్లలో అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. మెడికల్‌ సీట్లకు డొనేషన్‌ తీసుకోవట్లేదని తెలిపారు. ఎంబీబీఎస్‌లో మెనేజ్‌మెంట్‌ కోటా లేదన్నారు. ఆన్‌లైన్‌లోనే కౌన్సిలింగ్‌ జరుగుతుందని వివరించారు. మేనేజ్‌మెంట్‌ కోటా లేనప్పుడు డొనేషన్లు ఎలా వస్తాయి? వందల కోట్లు ఎలా వస్తాయి? అని మల్లారెడ్డి ప్రశ్నించారు.

Advertisement

మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టర్కీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. బోయిన్‌పల్లి సౌజన్య కాలనీ‌లో‌ని అల్లుడు ఇంటికి మంత్రి మల్లారెడ్డి వెళ్లారు. కూతురు, మనవరాలు, వియ్యంకుడితో 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఐటీ దాడుల నేపథ్యంలో జరిగిన పరిణామాల గురించి ఆరా తీశారు.


Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×