E-Paper
Advertisement

KRMB: కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం.. సాగర్‌లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపు

KRMB: కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం..  సాగర్‌లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపు
Advertisement

KRMB Three Member Committee: వేసవి కాలంలో తాగు నీటి కోసం నీటి కేటాయింపు అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చర్చించాయి. ఈ నీటి కేటాయింపులపై కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది.

నాగార్జున సాగర్ లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు ఈ కమిటీల కేటాయించింది. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని కేఆర్‌ఎంబీ కమిటీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

ఈ సమావేశంలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమీటీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మే నెలలో కేఆర్‌ఎంబీ మరోసారి ఈ కేటాయింపుల విషయంలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపులపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ జలశౌధలో నిర్వహించారు.

తమకు మరో ఐదు టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణకు అదనంగా 7 టీఎంసీల నీటిని వినియోగించుకొందని ఏపీ ఈఎన్సీ పేర్కొంది. సాగర్ నుంచి వెంటనే తమకు రావాల్సిన 5 టీఎంసీల నీటిని ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేసింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×