E-Paper
Advertisement

Mulugu news: బ్రిడ్జి కూలి 8మంది మృతి.. ముందే హెచ్చరించిన బిగ్ టీవీ..

Mulugu news: బ్రిడ్జి కూలి 8మంది మృతి.. ముందే హెచ్చరించిన బిగ్ టీవీ..
Advertisement
BIG TV on Mulugu latest news

Mulugu latest news(Breaking news updates in telangana):

ములుగు జిల్లాలోని జంపన్న వాగు. కొండాయి దగ్గర వాగుపై ప్రమాదకరరీతిలో బ్రిడ్జి ఉంది. కొండాయి బ్రిడ్జ్‌ కూలిపోయే పరిస్థితిపై.. జూలై 22న బిగ్ టీవీ జనతా గ్యారెజ్‌లో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. తగు చర్యలు తీసుకోమని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తోలుమందం అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. కొండాయి బ్రిడ్జిని మరమ్మత్తులు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఫలితం.. తాజా వరదలకు బ్రిడ్జి కుప్పకూలిపోయింది. 8మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది.

ఎంత దారుణం? ఎంతటి నిర్లక్ష్యం? ఆ బ్రిడ్జి ప్రమాదంలో ఉందని బిగ్ టీవీ ముందే హెచ్చరించినా పట్టించుకోలేదు పాలకులు. ప్రజలంటే, వారి ప్రాణాలంటే అంతటి చిన్నచూపు వారికి. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు.

Advertisement

భారీ వరదకు కొండాయి బ్రిడ్జ్‌ కూలింది. వంతెన కూలటంతో 8 మంది గల్లంతయ్యారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఒకరి గల్లంతయ్యారు. వంతెన కూలడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి.

బిగ్ టీవీలో ఆ బ్రిడ్జిపై ప్రత్యేక కథనం ప్రసారమైన వారానికే ఈ ప్రమాదం జరిగింది. బిగ్‌ టీవీ హెచ్చరికతోనైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి ఉంటే బాగుండేది. కనీసం రాకపోకలు నిషేధించినా ముప్పు తప్పేది. ఇప్పుడు ఇంతటి ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు.

Advertisement

సర్కారు ఉదాసీనత, పాలకుల నిర్లక్ష్యం ఇప్పుడు జనం ప్రాణాలను తీసింది. మరి, ఈ మృత్యుఘోషకు కారకులెవరు? పట్టించుకోని ప్రభుత్వమా? చేతకాని అధికారులా? బిగ్ టీవీ నిగ్గదీసి అడుగుతోంది. సమాధానం చెప్పే దమ్ము ఎవరికి ఉంది?

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×