E-Paper
Advertisement

Kondagattu: కొండగట్టు దొంగలు.. ‘ఖాకీ’ సినిమా స్టైల్ క్యాచింగ్.. పట్టిచ్చిన బీరు సీసా..

Kondagattu: కొండగట్టు దొంగలు.. ‘ఖాకీ’ సినిమా స్టైల్ క్యాచింగ్.. పట్టిచ్చిన బీరు సీసా..
Advertisement

Kondagattu: కార్తి హీరోగా చేసిన ఖాకీ మూవీ ఖతర్నాక్ ఉంటుంది. పోలీస్ మార్క్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో చూపించింది. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఎందాకైనా వెళతారనే విషయం గుర్తు చేస్తుంది. సినిమాలో దోపిడీ దొంగల ముఠా.. లూటీలు చేసి.. రాష్ట్రాలు దాటేస్తుంది. ఆ దొంగలంతా ఒకే ఊరు వాళ్లు, బంధువులు. వేలిముద్రల ఆధారంగా వాళ్లు ఎక్కడివారో తెలుసుకుని.. ఆ స్టేట్‌కి వెళ్లి మరీ వారిని పట్టుకుంటారు పోలీసులు. ఇదీ సింపుల్‌గా ‘ఖాకీ’ సినిమా స్టోరీ.

సేమ్ టు సేమ్.. ఖాకీ మూవీ తరహాలోనే కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను పట్టుకున్నారు జగిత్యాల పోలీసులు. మొత్తం ఏడుగురు దొంగలు. అంతా బంధువులే. అందులో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. కర్నాటకలోని బీదర్ నుంచి బైక్‌లపై కొండగట్టుకు వచ్చి.. పక్కాగా రెక్కీ చేసి.. స్వామి వారి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సీఎం కేసీఆర్ ఆలయ పర్యటనకు వచ్చి వెళ్లాక కొద్ది రోజులకే ఈ దొంగతనం జరగడంతో.. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు.

Advertisement

దొంగల ముఠా బీదర్ నుంచి కొండగట్టుకు మోటార్ సైకిళ్లపై ఫిబ్రవరి 2న రాత్రి చేరుకున్నారు. భక్తుల మాదిరిగా తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి అదేరోజు రాత్రి అంజన్నను దర్శించుకున్నారు. మరుసటిరోజు (ఫిబ్రవరి 23) మరోసారి స్వామివారి దర్శణం చేసుకున్నారు. పరిసరాలపై రెక్కీ నిర్వహించారు. అర్ధరాత్రి దాటాక.. ఆలయం వెనకాల అటవీ ప్రాంతం నుంచి గుళ్లోకి ప్రవేశించారు. స్వామివారిపై ఉన్న మకర తోరణం, కిరీటం, రెండు శఠగోపాలు, వెండి గొడుగు, రామరక్ష, ద్వారాలకు ఉన్న కవచ ముఖాలు దొంగిలించారు. సుమారు 15 కేజీల వెండి అభరణాలు చోరీకి గురయ్యాయి. ఎందుకోగానీ, బంగారు ఆభరణాలు మాత్రం ఎత్తుకెళ్లలేదు.

దొంగలను పట్టుకునేందుకు 10 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ కేసులో పోలీస్ డాగ్ కీ రోల్ ప్లే చేసింది. దొంగలు ఆలయంలో చోరీ చేసిన తరువాత.. గుడి వెనకవైపునకు వెళ్లి మద్యం సేవించారు. పోలీస్ డాగ్.. ఆలయం వెనకవైపు పడేసిన ఖాళీ బీరు సీసాల వాసన పసిగట్టింది. పోలీసులు ఆ బీరు సీసాలపై ఉన్న వెలిముద్రలు సేకరించారు. వాటి ఆధారంగా దొంగలెవరో తేలిపోయింది. వారంతా బీదర్‌కు చెందిన దొంగల ముఠాగా గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాలు బీదర్ వెళ్లి ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. అయితే, మరో నలుగురు దొంగలు మాత్రం దొరకలేదు. వారికోసం కర్నాటకలో విస్తృతంగా గాలిస్తున్నారు. దొంగతనం చేసిన వెండి ఆభరణాలను రికవరీ చేశారు జగిత్యాల పోలీసులు.

Advertisement

ఆ ఏడుగురు దొంగలూ రక్త సంబంధీకులేనని తేలింది. ఇందులో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. వారంతా కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరద్ తాలుకా హులియట్ తండాకు చెందిన వారు. ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలు చేస్తుంటారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పండరీపురం, కర్ణాటక, తెలంగాణలోని చాముండేశ్వరి తదితర ఆలయాల్లో చోరీచేశారు. కొండగట్టు అంజన్న ఆలయంలోనూ చోరీ చేసి.. జగిత్యాల పోలీసులకు దొరికిపోయారు. దొంగలెవరో 24 గంటల్లోనే గుర్తించినా.. బీదర్ వెళ్లి వారిని పట్టుకోవడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఈ పోలీస్ ఆపరేషన్‌లో పాల్గొన్న 27 మంది సిబ్బందికి.. ప్రభుత్వం తరఫున రివార్డులు అందించనున్నారు. తెలంగాణ పోలీసులా.. మజాకా.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×