E-Paper
Advertisement

Kodandaram : జై తెలంగాణ అనడానికి కేసీఆర్ కు సిగ్గు ఎందుకు? .. కోదండరాం సూటి ప్రశ్న..

Kodandaram : జై తెలంగాణ అనడానికి కేసీఆర్ కు సిగ్గు ఎందుకు? .. కోదండరాం సూటి ప్రశ్న..
Advertisement

Kodandaram : ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. జై తెలంగాణ అనడానికి సిగ్గు ఎందుకు అని ప్రశ్నించారు. ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించిన కోదండరాం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు.

తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ విధ్వంసం చేశారని కోదండరాం ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధే జరగలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న కేసీఅర్ సింగరేణిలో సగం వాటా ప్రైవేట్ పరం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. విద్యా, వైద్యం ప్రైవేట్ అయ్యాయని.. ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు. ఈ నెల 30న కృష్ణా నదీ జలాల్లో వాటాపై ఢిల్లీలో పోరాడుతామని ప్రకటించారు. 31న విభజన హామీలపై సెమినార్ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని కోదండరాం ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందని చెప్పడం అబద్దమన్నారు. ప్రాజెక్టు కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు పూర్తి కాలేదన్నారు. కృష్ణా నదీపైనా ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పేదల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారని కోదండరాం ఆరోపించారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో కేసీఆర్ జై తెలంగాణ అనకపోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇదే విషయంపై కేసీఆర్ ను విమర్శించారు. మరి గులాబీ బాస్ జై తెలంగాణ నినాదం చేయకపోవడంపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×