E-Paper
Advertisement

Kishan Reddy Visit : వరద ప్రభావిత గ్రామాల్లో కిషన్ రెడ్డి పర్యటన.. రేపు తెలంగాణకు కేంద్ర బృందం..

Kishan Reddy Visit : వరద ప్రభావిత గ్రామాల్లో కిషన్ రెడ్డి పర్యటన.. రేపు తెలంగాణకు కేంద్ర బృందం..
Advertisement
Kishan Reddy latest news

Kishan Reddy latest news(BJP news in telangana):

వరద బాధితులకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పరిస్థితిని పరిశీలించారు.

వరద ప్రభావంతో దెబ్బతిన్న ఇతర గ్రామాలకు వెళ్లారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న వంతెన, రోడ్లను పరిశీలించారు. కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

కేంద్ర బృందాలు సోమవారం తెలంగాణకు వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. వరద నష్టం వివరాలు సేకరిస్తాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.రాజకీయాలకు అతీతంగా బాధితులకు సాయం అందించాలన్నారు. రాష్ట్ర సర్కార్ వద్ద ఉన్న రూ.900 కోట్ల విపత్తు నిధులను బాధితులకు సాయం చేసేందుకు వాడాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం రూ.లక్ష ఇస్తాయని తెలిపారు.

వరద నష్టం అంచనా వేసేందుకు మొత్తం 8 శాఖల అధికారుల కేంద్రం బృందం తెలంగాణలో పర్యటిస్తుంది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సలహాదారు కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని బృందం సోమవారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుంది. ఈ టీమ్ లో ఆర్థిక, వ్యవసాయ, జలశక్తి,విద్యుత్‌, రోడ్డు రవాణా, స్పేస్‌ డిపార్ట్‌మెంట్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అధికారులు ఉంటారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×