E-Paper
Advertisement

Khammam: పామాయిల్ రైతుల ఆందోళన.. పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..

Khammam: పామాయిల్ రైతుల ఆందోళన.. పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..
Advertisement

Khammam: ఖమ్మం జిల్లా వైరాలోని అంజనాపురంలో గత ప్రభుత్వ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆగమేఘాల శంకు స్థాపన చేశారు. గోద్రెజ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఒప్పందం జరిగింది. అయితే ఫ్యాక్టరీ నిర్మాణానికి కావలసిన భూమిని గిరిజన, సన్న, చిన్నకారు రైతుల వద్ద నుంచి బలవంతంగా గుంజుకున్నారని రైతులు ఆందోళన చేశారు. జిల్లా అధికారులే బెదిరించి వంద ఎకరాలకు పైగా భూమిని తమ వద్ద నుంచి సేకరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంగా ఒక్క ఎకరానికి రూ.25 లక్షలు వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. భూమిని ఇచ్చిన తర్వాత కేవలం రూ.20 లక్షలు మాత్రమే చెల్లించారని.. మిగిలిన రూ.5 లక్షలు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. ఇదే విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని.. ఇక చేసేది ఏమీ లేక అందోళన బాట పట్టామని రైతులు తెలిపారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×