E-Paper
Advertisement

Khairtabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం పూర్తి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

Khairtabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం పూర్తి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
Advertisement

Khairtabad Ganesh idol Immersion: ఖైరతాబాద్ భారీ వినాయకుడి విగ్రహం గంగమ్మ ఒడికి చేరుకుంది. సూపర్ క్రేన్ సాయంతో మహా గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వంచారు. ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ -4 వద్ద హుస్సేన్ సాగర్ లో భారీ గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాాయి. ఎక్కడ చూసినా భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిటకిటలాడుతున్నాాయి. అనుకున్న సమయంలోగా ప్రశాంత వాతావరణంలో భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మిగతా వినాయకుల నిమజ్జన ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటు బలాపూర్ భారీ గణేషుడు కూడా హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ క్రేన్ 12 వద్ద ఈ వినాయకుడిని హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేయనున్నారు. భక్తులు, యువత, కుటుంబ సమేతంగా ప్రజలు ట్యాంక్ బండ్ కు భారీగా చేరుకుని వినాయకుల నిమజ్జనాాలను తిలకిస్తున్నారు. యువత పెద్ద ఎత్తున బ్యాండ్ చప్పుళ్ల మధ్య స్టెప్స్ వేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ పరిసరాలు యువత కేరింతలతో కోలాహలంగా మారింది. ఈ క్రమంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Also Read: హుస్సేన్ సాగర్‌కు వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడే రోడ్లు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని చూసి..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×