E-Paper
Advertisement

Kavitha : కవిత అభ్యర్థన తిరస్కారం.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Kavitha : కవిత అభ్యర్థన తిరస్కారం.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..
Advertisement

Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. మార్చి 16న ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 20న మళ్లీ విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఇప్పటికే తాను ఈడీ విచారణపై దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరారు. అయితే ఆమె అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో చెప్పిన ప్రకారం ఈ నెల 24వ తేదీనే ఆ పిటిషన్ ను విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మార్చి 20న తమ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని కవితకు గురువారం ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణ జరిగేంత వరకు ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైను గురువారం ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఈడీ ఆయనను కవితతో కలిపి ముఖాముఖి ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. దీంతో ప్రత్యేక న్యాయస్థానం రామచంద్ర పిళ్లై కస్టడీని మార్చి 20 వరకు పొడిగించింది. మార్చి 20న ఉదయమే కవిత-అరుణ్‌ పిళ్లైను ఎదురెదురుగా కూర్చోబెట్టి వాస్తవాలు రాబట్టుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. ఒకవేళ కవిత విచారణ రాకపోతే ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

TSPSC: పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసన.. బండి సంజయ్ అరెస్ట్

Military employees:-సైనికులను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×