E-Paper
Advertisement

Telangana: జేడీఎస్‌తో కేసీఆర్‌ను ఓడించాం: రేవంత్.. అంతసీన్ లేదు: కేటీఆర్..

Telangana: జేడీఎస్‌తో కేసీఆర్‌ను ఓడించాం: రేవంత్.. అంతసీన్ లేదు: కేటీఆర్..
Advertisement

Telangana: కర్ణాటకలో హస్తం హవాతో రాజకీయ లెక్కలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. కర్ణాటక హస్తగతం అవడంతో తెలంగాణపై ఎఫెక్ట్ కనిపిస్తుందని చెబుతున్నారు. కన్నడ నాట గెలుపు.. తెలంగాణలో మలుపు అన్నట్లుగా ప్రచారం జరిగింది. గాంధీ భవన్ దగ్గర గతంలో ఎన్నడూ లేనంత సందడి, సంబరాలు కనిపించాయంటే.. కర్ణాటక గెలుపు ఇక్కడ ఎలా పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. టీ.కాంగ్రెస్ కు ఇక మంచిరోజులే అంటున్నారు.

Advertisement

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ కు మంచిరోజులు వచ్చినట్లేనన్న సంతోషంలో కనిపిస్తున్నారు నేతలు.
కర్ణాటక రిజల్ట్ తెలంగాణలోనూ రిపీట్ అవుతుందని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. బీజేపీని ఓడించడం ద్వారా మోదీని, జేడీఎస్ ను ఓడించడం ద్వారా కేసీఆర్ ను ఓడించామని రేవంత్ చెప్పుకొచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎర్రకోటపై జెండా ఎగరేస్తామన్నారు.

ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ నుంచి బండి సంజయ్, ఈటల వంటి నాయకులు వెళ్లి ప్రచారం చేసిన చోటే బీజేపీ అభ్యర్థులు చాలా వరకు ఓడిపోయారు. ఇది కాంగ్రెస్ కు భారీ బూస్టప్ గా మారింది. కర్ణాటకలో గెలిస్తే ఇక దక్షిణాదిన తిరుగుండదు.. ఇక తెలంగాణలోనూ కమల వికాసమే అని భావించారు. కర్ణాటక తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణ అని కూడా బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. అయితే కర్ణాటక దగ్గరే బీజేపీకి బ్రేక్ పడినట్లయింది.

Advertisement

కర్ణాటకలో బరిలో నిలిచిన రెండు పార్టీలే.. తెలంగాణలో ప్రధాన, ప్రత్యర్థి పక్షాలుగా ఉండటంతో వ్యూహాలు రచించే పనిలో బీఆర్ఎస్ పడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోవని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కర్ణాటక ప్రజలు విభజన, విద్వేశ రాజకీయాలను తిప్పికొట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

కర్ణాటక గెలుపు మూడ్ ను తెలంగాణలోనూ కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. అయితే అలాంటి ఎఫెక్ట్ ఏమీ లేదని చెప్పడం ద్వారా తమ పార్టీపై ప్రభావం పడకుండా బీఆర్ఎస్ నేతలు చూసుకుంటున్నారు. కర్ణాటక గెలుపుతో ఇప్పుడు జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు క్రమం తప్పకుండా తెలంగాణలో పర్యటించేందుకు ప్రణాళికలు రచించుకునే పనిలో పడ్డారు.

Follow this link for more updates:- Bigtv

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×