E-Paper
Advertisement

HYDRA: సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం ఇప్పటికైనా అర్థమైందా?: జనసేన

HYDRA: సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం ఇప్పటికైనా అర్థమైందా?: జనసేన
Advertisement

Janasena: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖతర్నాక్ నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వేరే రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయంపై ఆలోచనలు చేస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, కుంటలు, నాలాలు, చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను వేగంగా నేలమట్టం చేస్తున్నారు. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను కాపాడితేనే రాజధాని నగరం వరదల బారిన పడదని సీఎం స్పష్టం చేశారు.

హైడ్రా వేగంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ దూసుకుపోతున్నది. ఈ తీరుపై మెజార్టీ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. కొందరు మాత్రం హైడ్రాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికే హైడ్రాను తెచ్చారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. హైడ్రాకు రాష్ట్ర ప్రజల నుంచి మద్దతు రావడమే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సపోర్ట్ లభిస్తున్నది. తాజాగా, జనసేన హైడ్రా ఏర్పాటును సమర్థించింది.

Advertisement

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు భారీ వర్షాలు, వీటి వల్ల రోడ్లు, ఇళ్లు నీటమునిగిపోతున్న తరుణంలో హైడ్రాను ప్రస్తావించారు. వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు, నాలాలు ఉప్పొంగి పోయి అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు రావడం, కొన్ని సామాన్య ప్రాణాలు కూడా వరదలకు బలికావడం చాలా బాధాకరమైన ఘటనలు అని అభిప్రాయపడ్డారు. అయితే, వీటికి ప్రధాన కారణం మాత్రం చెరువులను, నాలాలను అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడమేనని వివరించారు.

Also Read: Vande Bharat Sleeper Trains: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేసింది.. దిమ్మదిరిగే ఫీచర్స్ ఇవే

Advertisement

అలాంటి వాటిని కూల్చడానికే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అర్థమైందా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా కాన్సెప్ట్? అంటూ ట్వీట్
చేశారు. ఆయన సాహసోపేత నిర్మాణాలు తీసుకోవడం, మంచి పురోగతి సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రశంసలు కురిపించారు. ‘మీకు మా సంపూర్ణ మద్దతు’ అని నాగబాబు స్పష్టం చేశారు. ‘పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్తిస్తే అది కూడా కచ్చితంగా మనలను శిక్షిస్తుందని తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×