E-Paper
Advertisement

Jagtial Shocking Incidents: బ్రతికుండగానే ఆ నలుగురు.. తల్లిని మోశారు.. జగిత్యాలలో దారుణం

Jagtial Shocking Incidents: బ్రతికుండగానే ఆ నలుగురు.. తల్లిని మోశారు.. జగిత్యాలలో దారుణం
Advertisement

Jagtial Shocking Incident: సాధారణంగా మన కంటి ఎదురుగా ఎవరైనా అచేతన స్థితిలో ఉంటే, మన కళ్లు చెమ్మగిల్లుతాయి. చేతనైతే ఇంత సాయం అందిస్తాం. కానీ అదే మన తల్లిదండ్రులకు ఆ కష్టం వస్తే.. తల్లడిల్లిపోతాం. ఇటీవల కొందరు కుమారులు మాత్రం తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే, నరకం అంటే ఇదీ అన్నట్లుగా భూలోకంలోనే వారికి యమలోకం చూపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తల్లి బ్రతికి ఉండగా ఆ నలుగురు కొడుకులు.. ఆ నలుగురిగా మోస్తూ.. తల్లిని స్మశానంలో వదిలేశారు. ఇంత దారుణానికి పాల్పడడానికి గల కారణం ఏమిటో తెలిస్తే ఔరా అనేస్తారు.

జగిత్యాలలో మోతె స్మశాన వాటిక ఉంది. అక్కడికి ఆ నలుగురు మోసుకుంటూ ఒకరిని అక్కడికి తీసుకువచ్చారు. ఎవరో చనిపోయారు అందుకేనేమో.. తీసుకువచ్చారని అనుకున్నారు అందరూ. అక్కడే ట్విస్ట్ తెలిసి ఖంగుతిన్నారు. జగిత్యాలకు చెందిన రాజవ్వకు నలుగురు కుమారులు. అయితే గత కొద్దిరోజులుగా వారి ఆప్యాయతకు తల్లి రాజవ్వ దూరమైంది. అది కూడా ఆ నలుగురు కుమారులలో ఒక కుమారుడు ఇటీవల పింఛన్ నగదు కోసం స్వయాన తల్లినే చితకబాదాడు.

Advertisement

చెప్పేందుకు నలుగురు కుమారులు ఉన్నా.. బువ్వ పెట్టే దిక్కులేని పరిస్థితి రాజవ్వది. ఎలాగైనా రాజవ్వను వదిలించుకోవాలనుకున్న వారు, బ్రతికి ఉండగానే నేరుగా స్మశానవాటికకు తరలించారు. ఇప్పటికే 8 రోజులుగా అన్నం పెట్టే దిక్కులేక, ఆశ్రయించే వారు లేక అక్కడే రాజవ్వ కాలం వెళ్లదీస్తోంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న సంక్షేమ శాఖ అధికారులు.. రాజవ్వను సంప్రదించారు.

Also Read: Batti Comments : కలెక్టర్‌ని అంత మాట అంటావా?.. నీకు మర్యాద తెలుసా..? భట్టి విక్రమార్క సీరియస్

Advertisement

రాజవ్వ ఉన్నది ఉన్నట్లుగా వివరించి, తనను ఆదుకోవాలని వారిని ప్రాధేయపడింది. వెంటనే రాజవ్వను వైద్యశాలకు తరలించి వారు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై సంక్షేమ శాఖ అధికారి నరేష్ మాట్లాడుతూ.. రాజవ్వ కుమారులపై వయోవృద్ధులు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏదిఏమైనా బాల్యంలో తన పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తుంటే చిరునవ్వులు చిందించిన ఆ తల్లి, ఈరోజు అవే అడుగులతో బ్రతికుండగానే స్మశానానికి తీసుకువస్తారని ఊహించలేక పోయింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×