E-Paper
Advertisement

New Secretariat : కొత్త సచివాలయం వద్ద సందడి వాతావరణం.. మధ్యాహ్నం ప్రారంభోత్సవం ..

New Secretariat : కొత్త సచివాలయం వద్ద సందడి వాతావరణం.. మధ్యాహ్నం ప్రారంభోత్సవం ..
Advertisement

New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే వాస్తు పూజ, యాగం నిర్వహిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి చేరుకుంటారు.

తొలుత ప్రధాన ప్రవేశ గేటు వద్ద కేసీఆర్ పూజ నిర్వహిస్తారు. హోమశాల వద్ద యాగ పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఆరో అంతస్తులోని తన ఛాంబరుకు చేరుకుంటారు. పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేసి కొత్త సచివాలయం నుంచి పరిపాలనను ప్రారంభిస్తారు. కేసీఆర్ తన ఛాంబరుకు వెళ్లే సమయంలో అక్కడకి మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా తమ ఛాంబర్ల వద్ద ఉండాలి. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్య తమ ఛాంబర్లలో ఆసీనులై దస్త్రాలపై సంతకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రక్రియ పూర్తికాగానే అందరూ గ్రౌండ్‌ ఫ్లోర్‌ కు చేరుకుని సమావేశంలో పాల్గొంటారు. 2.15 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశ వేదికకు చేరుకుని తన సందేశాన్ని ఇస్తారు.

సచివాలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగురంగుల పూలున్న కుండీలను ఏర్పాటు చేశారు. ప్రధాన గేట్లను పూలమాలలతో అలంకరించారు. సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయి. హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు, నెక్లెస్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు.తెలుగు తల్లి జంక్షన్‌లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌పై వాహనాలకు ఎంట్రీ లేదు. ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి, బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లో వాహనాలకు అనుమతి ఇవ్వడంలేదు. ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులను మూసివేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×