E-Paper
Advertisement

Farm house case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత..

Farm house case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత..
Advertisement

Farm house case : తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్‌ మంజూరు చేస్తే ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్‌, సింహయాజి, రామచంద్రభారతి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.

మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.కేసు దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి సీజే ధర్మాసనాన్ని శనివారం ఆశ్రయించారు. స్టేను యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపించాలని ప్రేమేందర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం మంగళవారం విచారణ చేపడతామని తెలిపింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×