E-Paper
Advertisement

Orange Alert : సుర్రుమంటున్న సూరీడు.. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌

Orange Alert : సుర్రుమంటున్న సూరీడు.. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌
Advertisement

SummerSummer: మార్చి నెల మొదటి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని తెలుగు రాష్ట్రాలపై చూపిస్తున్నాడు. తాజాగా భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. దీంతో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి బయపడిపోతున్నారు. అయితే భానుడి ప్రతాపం మరికొన్ని రోజులు కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోనున్నాయని.. కొన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉందని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల అధికారులకు వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సైతం వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గతంలో కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వెల్లడించింది. పగటి సమయంలో వృద్ధులు, చిన్నారులు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరించింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×