E-Paper
Advertisement

Hyderabad Traffic Police: హైదరాబాద్‌లో లైసెన్స్ లేని డ్రైవర్లపై పోలీసుల ఉక్కుపాదం.. మార్చి 1 నుండి ప్రత్యేక తనిఖీలు

Hyderabad Traffic Police: హైదరాబాద్‌లో లైసెన్స్ లేని డ్రైవర్లపై పోలీసుల ఉక్కుపాదం.. మార్చి 1 నుండి ప్రత్యేక తనిఖీలు
Advertisement

Hyderabad Traffic Police: హైదరాబాద్ నగర రోడ్లపై క్రమశిక్షణను పెంచేందుకు, ప్రమాదాల శాతాన్ని తగ్గించేందుకు ట్రాఫిక్ విభాగం సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇప్పటివరకు సాధారణ తనిఖీల్లో భాగంగా హెల్మెట్, రాంగ్ రూట్ వంటి అనేక అంశాలను ఒకేసారి తనిఖీ చేసే పోలీసులు, ఇకపై ‘నో లైసెన్స్ – నో డ్రైవింగ్’ అనే నినాదంతో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నారు. మార్చి 1 నుండి నగరవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

సాధారణ తనిఖీల్లో అన్ని రకాల ఉల్లంఘనలను చూడటం వల్ల లైసెన్స్ లేని వారిపై ఫోకస్ తగ్గుతోందని గుర్తించిన పోలీసులు, ఈసారి ప్రత్యేకంగా కేవలం లైసెన్స్‌లపైనే దృష్టి పెట్టనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం కేవలం నిబంధనల ఉల్లంఘనే కాకుండా, రోడ్డు భద్రతకు పెద్ద ముప్పు అని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రధాన జంక్షన్లు, శివారు ప్రాంతాలు మరియు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

Advertisement

ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టడంపై ట్రాఫిక్ విభాగం సీరియస్‌గా ఉంది. సరైన అవగాహన లేని వయసులో వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం పొంచి ఉంటుందని, అందుకే మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మైనర్ల విషయంలో జరిమానాతో పాటు వాహన యజమానులకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని, వారి వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

చట్టపరమైన చిక్కులతో పాటు ఆర్థిక పరమైన నష్టాలను కూడా పోలీసులు గుర్తు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగితే, సదరు వాహనానికి ఉన్న బీమా (Insurance) వర్తించదని స్పష్టం చేశారు. బీమా క్లెయిమ్‌లు తిరస్కరించబడటం వల్ల ప్రమాద బాధితులకు చెల్లించాల్సిన పరిహారం మొత్తం వాహన యజమానే భరించాల్సి ఉంటుంది. ఇది కుటుంబాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు.

Advertisement

Also Read: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక యూరియా కొనుగోలు చేసిన జిల్లా ఇదే..?

ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ పొందని వారు వెంటనే రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కార్యాలయాలను సంప్రదించి, స్లాట్ బుక్ చేసుకోవాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయెల్ డేవిస్ కోరారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా లైసెన్స్ చూపించినా అనుమతిస్తామని, అసలు లైసెన్సే లేకుండా రోడ్లపైకి వస్తే మాత్రం వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కోర్టుకు పంపుతామని హెచ్చరించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×