E-Paper
Advertisement

Toxic Chemicals in Food: హైదరాబాద్‌లో దారుణం.. 70 క్వింటాళ్ల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కుళ్లిన గుడ్లతో కేకులు

Toxic Chemicals in Food: హైదరాబాద్‌లో దారుణం.. 70 క్వింటాళ్ల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కుళ్లిన గుడ్లతో కేకులు
Advertisement

Toxic Chemicals in Food: హైదరాబాద్ నగరం మరోసారి కల్తీ మాఫియా గుట్టురట్టు కావడంతో ఉలిక్కిపడింది. సామాన్యుల ఆరోగ్యం కంటే లాభాలే పరమావధిగా భావించే కొందరు కేటుగాళ్లు, వంటింట్లో వాడే నిత్యావసరాల నుండి పిల్లలు ఇష్టంగా తినే తినుబండారాల వరకు వేటినీ వదలడం లేదు. తాజాగా అత్తాపూర్, కాటేదాన్ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడులు నగరంలో ఆహార కల్తీ ఏ స్థాయిలో వేళ్లూనుకుందో స్పష్టం చేస్తున్నాయి. నిత్యం మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నారులు అమితంగా ఇష్టపడే కేకులు, డోనట్లలో విషతుల్యమైన రసాయనాలు కలపడం ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారింది.

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్, ఎం.ఎం. పహాడీ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డెక్కన్ ట్రేడర్స్ గోడౌన్‌పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడమే లక్ష్యంగా సోహైల్ చరానియా, రహీమ్ చరానియా, అమిత్ చరానియా అనే ముగ్గురు సోదరులు ఈ అక్రమ వ్యాపారానికి తెరలేపారు.

Advertisement

అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ఈగలు ముసురుతున్న చోట వెల్లుల్లి పొట్టు, శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ మరియు సింథటిక్ ఫుడ్ కలర్లను కలిపి అచ్చం అల్లం వెల్లుల్లి పేస్ట్‌లా కనిపించేలా కల్తీ చేస్తున్నారు. ఈ సోదాల్లో సుమారు 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్, ప్రమాదకర రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆకర్షణీయమైన ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి హోల్‌సేల్ షాపులకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నారు.

కాటేదాన్ ప్రాంతంలోని ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’పై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నిర్వహించిన దాడిలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలు ఇష్టంగా తినే కేకులు, డోనట్లను తయారు చేయడానికి వీరు కుళ్ళిపోయిన, పగిలిపోయిన కోడిగుడ్లను ఉపయోగిస్తున్నారు. ఆ కుళ్ళిన వాసన బయటకు రాకుండా ఉండటానికి సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్, అమ్మోనియా సల్ఫైట్ వంటి హానికరమైన రసాయనాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వందల కేజీల కల్తీ డోనట్లు, కుళ్ళిన కోడిగుడ్లను పోలీసులు సీజ్ చేశారు.

Advertisement

ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల స్వల్పకాలికంగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే, దీర్ఘకాలికంగా వీటిని వాడటం వల్ల కాలేయం (Liver), కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కేకుల్లో వాడే అమ్మోనియా సల్ఫైట్, అల్లం పేస్ట్‌లోని యాసిడ్లు జీర్ణవ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయి.

ప్రజలు కూడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు కేవలం తక్కువ ధరను చూసి మోసపోకుండా, నాణ్యతను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

Read Also: Fuel supply India: దేశంలో పెట్రోల్ కొరత ఉందా..? ఇంధన ధరలపై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×