E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లో 107 కేసుల నమోదు.. మీరు మాత్రం ఇలా చేయవద్దు!

Hyderabad News: హైదరాబాద్‌లో 107 కేసుల నమోదు.. మీరు మాత్రం ఇలా చేయవద్దు!
Advertisement

Hyderabad News: సంక్రాంతి సంబరాల సంగతి ఏమో కానీ, పతంగులు ఎగురు వేసేందుకు వాడే చైనా మాంజాలతో కు జరిగే ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకున్నారనే చెప్పవచ్చు. ఈ సంక్రాంతికి అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సీరియస్ గా చైనా మాంజాలను అరికట్టేందుకు స్పీడ్ పెంచారు.

హైదరాబాద్ నగరంలో ఎక్కువగా చైనా మాంజాలను వినియోగించకుండా సంక్రాంతి ముందునుండే పోలీసులు పలుమార్లు హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు అమ్మకాలపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు చైనా మాంజాల విక్రయాలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

Advertisement

డీసీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోని ఏడు జోన్ల పరిధిలో చైనా మాంజాల వినియోగానికి సంబంధించి 107 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే విక్రయాలు సాగిస్తున్న 148 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అంతేకాకుండా 7334 బాబిన్స్ చైనా మాంజాలను సీజ్ చేసి, సుమారుగా 90 లక్షల విలువగల మాంజాలను సీజ్ చేశామన్నారు.

కొద్ది రోజులుగా నగరంలో తనిఖీలు చేసి వీటి విక్రయాల నిషేధం పై పురోగతి సాధించినట్లు డీసీపీ తెలిపారు. చైనా మాంజాలను అమ్మినా, కొనుగోలు చేసినా వారి సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఇవ్వాలని, మన సరదా పతంగులాట ఇతరుల ప్రాణాలను తీస్తుందంటూ డీసీపీ హెచ్చరించారు. ఈ కేసులలో పట్టుబడిన వారిపై అనిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో పతంగులను ఎగురవేసేవారు విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Also Read: Medak District Crime : గేదెల కోసం సీసీ పుటేజ్ వెతుకులాట.. ముగ్గురు దుర్మార్గుల అత్యాచారం సంగతి బట్టబయలు..

కాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిలో చైనా మాంజా తగిలి బాలుడి గొంతు కు తీవ్ర గాయాలైన ఘటన సోమవారం జరిగింది. గాలిపటం నుండి తెగివచ్చిన దారం, ఆరుబయట ఆడుకుంటున్న బాలుడు గొంతుకు తగలడంతో తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు బాలుడిని ప్రవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×