E-Paper
Advertisement

హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?
Advertisement

Dumping Yard: స్వేచ్ఛ బ్యూరో: నాలుగు జిల్లాల చెత్తతో హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా అని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి శివారులో సుమారు 125 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఉమ్మడి జిల్లాల డంపింగ్‌ యార్డు స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు.

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు..

ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, కొత్త సమస్యలను సృష్టించడం సరికాదన్నారు. నాలుగు జిల్లాల వ్యర్థాలను ఒకే చోట చేర్చడం వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యంపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.

Advertisement

Also Read: బీఆరెస్ పార్టీలో చంద్ర‌బాబుపై చ‌ర్చ‌! కేటీఆర్ వ్యూహానికి కేసీఆర్ గండి!

రైతులకు తీరని అన్యాయం..

“విత్తన భాండాగారంగా పేరొందిన హుజూరాబాద్‌ ప్రాంతంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయడం ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ, కీడు తలపెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో డంపింగ్‌ యార్డు చిచ్చు పెట్టడం వల్ల గత నెల రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

పోరాటాన్ని ఉధృతం చేస్తాం..

Advertisement

డంపింగ్‌ యార్డుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, సంఘాలు జేఏసీగా ఏర్పడి నిరసనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని, తక్షణమే డంపింగ్‌ యార్డును రద్దు చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు తుర్పాటి రాజు, పారిపెల్లి కొండల్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు మొలుగురి సుమలత, పంజాల మనోజ్‌, దామర అనూష, తూర్పాటి లక్ష్మీదుర్గ, కొండ ప్రశాంతి, సర్పంచి ముప్పు మహేష్‌, సీనియర్‌ నాయకులు పైల్ల వెంకట్‌రెడ్డి, గంగిశెట్టి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమం.. 70శాతంకు పైగా కాలిన గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×