E-Paper
Advertisement

కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో రేవంత్ రెడ్డి డైలాగులు: హరీశ్ రావు

కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో రేవంత్ రెడ్డి డైలాగులు: హరీశ్ రావు
Advertisement

Harish Rao: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో 15-20 రోజులుగా రైతులు వడ్ల కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చుని డైలాగులు కొట్టడం మానేసి.. కల్లాల వద్దకు వచ్చి రైతుల గోస చూడాలని డిమాండ్ చేశారు. రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి దొంగ రైతు బిడ్డ అని, రుణమాఫీ చేయకుండా దేవుని మీద ఒట్టు పెట్టి రైతులను వంచించారని ధ్వజమెత్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ప్రభుత్వం ఇప్పటివరకు పది పైసల వడ్లు కూడా కొనలేదని హరీశ్ రావు విమర్శించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు అవగాహనే లేదని, ఏ జిల్లాలోనూ మంత్రులు కొనుగోలు కేంద్రాల వైపు చూడటం లేదని ఆరోపించారు. జీపీఎస్, ఆన్‌లైన్ పేరిట రైతులను చిత్రహింసలు పెడుతున్నారని.. ఊళ్లోనే రైస్ మిల్లు ఉంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు పంపాలని నిబంధనలు పెట్టడం వల్ల రైతులకు రవాణా ఖర్చులు, సమయం వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ వంటి జిల్లాల్లో తాలు పేరిట క్వింటాల్ కు 4-5 కిలోల తరుగు తీస్తున్నారని, తరుగు పెడితే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలని ప్రశ్నించారు.

Advertisement

కేవలం ధాన్యం మాత్రమే కాకుండా శనగలు, సన్ ఫ్లవర్, మొక్కజొన్న పండించిన రైతులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో శనగలు పండితే సగం కూడా కొనకుండా కేంద్రాలు బంద్ పెట్టారని విమర్శించారు. మద్దతు ధర రూ. 3,371 ఉన్న జొన్నల కొనుగోలు కేంద్రాలే ప్రారంభించలేదని.. దీంతో రైతులు రూ. 2500 కే ప్రైవేటుకు అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు. మొక్కజొన్న విషయంలో కూడా ఎకరాకు 26 క్వింటాళ్లే కొంటామనే కొత్త నిబంధనలు తెచ్చి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టారని మండిపడ్డారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకగా హరీశ్ రావు అల్టిమేటం జారీ చేశారు. మూడు, నాలుగు రోజుల్లోగా ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని, కలెక్టరేట్ల ముందు వంటావార్పు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో షరతులు లేకుండా ఎంత పంట పండితే అంత కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Read Also: కేసీఆర్ బయటకు రావడానికి అసలు కారణం అదే.. కోదండరాం సంచలన వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×