E-Paper
Advertisement

Harish Rao Resign: రాజీనామాకు నేను రెడీ.. హరీశ్ రావు ప్రతిసవాల్

Harish Rao Resign: రాజీనామాకు నేను రెడీ.. హరీశ్ రావు ప్రతిసవాల్
Advertisement

Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మకంగా రైతు రుణమాఫీ చేస్తున్నది. ఏకకాలంలో రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా రాష్ట్రమంతటా సంబురాలు చేసుకుంటున్నాయి. వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతు రుణమాఫీ ప్రకటించారు. ఆ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్షరాల ఆచరణలో పెడుతున్నది. అయితే, రైతు రుణమాఫీ సాధ్యం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయపూనుకుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గతంలో విమర్శలు సంధించారు. అంతేకాదు, గన్ పార్క్ వద్దకు వచ్చి రాజీనామా లేఖను కూడా మీడియాకు ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేపడుతుండటంతో హరీశ్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఆయన సవాల్‌ను గుర్తు చేస్తున్నారు. అయితే, హరీశ్ రావు కూడా సంచలనంగా రియాక్ట్ అయ్యారు. తాను రాజీనామాను రెడీ అని, కానీ, రుణమాఫీతోపాటు ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలనే షరతు పెట్టారు.

ఈ రోజు రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపైనా స్పందించారు. రైతు రుణమాఫీ చేస్తే హరీశ్ రావు రాజీనామా చేస్తానని గతంలో హడావుడి చేసిన ఘటనను గుర్తు చేశారు. అయితే, తాను హరీశ్ రావు రాజీనామాను డిమాండ్ చేయడం లేదని స్పష్టం చేశారు. కానీ, ప్రతిపక్షం ఒక విషయం గుర్తుంచుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదని ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు. సాహసోపేత నిర్ణయాలైనా మాట ఇస్తే తప్పకుండా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వ సొంతం అని, గాంధీ కుటుంబం మాటకు కట్టుబడి ఉంటుందని వివరించారు.

Advertisement

మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తన పాత సవాల్‌పై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిసవాల్ చేశారు. తాను తన మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాజీనామాకు ఇప్పటికీ రెడీ అని స్పష్టం చేశారు. పంద్రాగస్టులోపు రైతులందరికీ రూ. 2 లక్షల పంట రుణమాఫీతోపాటు ఆరు గ్యారెంటీలు (ఇందులోని 13 హామీలు) అమలు చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని చెప్పారు. తాము ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు రాజీనామాలు చేశామని, ఎంపీ, ఎమ్మెల్యేల పదవులను తృణప్రాయంగా ఉద్యమం కోసం విడిచిపెట్టామని వివరించారు. తాము ఎప్పుడూ రాజీనామాలకు వెన్ను చూపలేదని, ప్రజా పక్షాన ఎప్పుడూ నిలబడేది తామేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీతోపాటు అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×