Hanumakonda: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చాటాయి. గౌట్ జూనియర్ కళాశాల విద్యార్థిని డి. శాన్విక, ఎంజెపి బాయ్స్ జూనియర్ కళాశాల విద్యార్థి డి. వినయ్ 993/1000 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. మండలంలోని మోడల్ స్కూల్, ఎంజెపి గర్ల్స్, కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారు.
తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రథమ సంవత్సరం 108 మంది పరీక్షలకు హాజరుకాగా 43 మంది ఉత్తీర్ణులై 40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 99 మందిలో 49 మంది ఉత్తీర్ణులై 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బి. వర్షిని 454/470 మార్కులతో కాలేజ్ టాపర్గా నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో పి. సాత్విక 987/1000 మార్కులు సాధించింది.
Also Read: సొంత పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీలొకి భారీ వలసలంటూ..!
కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ప్రథమ సంవత్సరం 69 మందిలో 60 మంది ఉత్తీర్ణులై 87 శాతం ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 57 మందిలో 48 మంది ఉత్తీర్ణులై 84 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో టి. రేఖ 462/470 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో సి.హెచ్. దివ్య 991/1000 మార్కులు సాధించగా, బైపీసీలో ఎ. అక్షిత 959/1000 మార్కులు సాధించింది. ఈ విజయానికి విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వమే కారణమని ప్రిన్సిపాళ్లు పి. కవితారెడ్డి, అనిత, అర్చన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించింది.
Also Read: బీఆర్ఎస్ నేతలకు చురకలంటించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి