E-Paper
Advertisement

Bandaru Dattatreya: ఓటు వేసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ..

Bandaru Dattatreya: ఓటు వేసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ..
Advertisement

Bandaru Dattatreya exercised his Vote: పార్లమెంటు నాలుగో దఫా ఎన్నికల్లో భాగంగా నేడు తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు, బండి సంజయ్, ఈటల రాజేందర్, కేటీఆర్, అసదుద్దీన్, సినీ నటుడు చిరంజీవి, అల్లు అర్జున్ తో సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లో సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మి ప్రణతితో ఆయన తల్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని రామ్ నగర్ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమన్నారు. ఓటుతో మార్పు తేవచ్చని ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చాలన్నారు.

Also Read: తెలంగాణలో పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Advertisement

కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక తోపాటు తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనున్నది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×