E-Paper
Advertisement

CM Revanth Reddy : అమరరాజా కంపెనీకి సహకరిస్తాం.. సీఎం రేవంత్ హామీ..

CM Revanth Reddy : అమరరాజా కంపెనీకి సహకరిస్తాం.. సీఎం రేవంత్ హామీ..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో అమరరాజా గ్రూప్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్‌, సంస్థ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, సీఎస్‌ శాంతి కుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో అమరరాజా సంస్థ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్దదైన లిథియం అయాన్‌ గిగా ఫ్యాక్టరీపై భేటీలో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ అమరరాజా కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా కంపెనీది కీలక పాత్ర ఉందన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికత ఉపయోగించే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందనన్నారు.

Advertisement

అనంతరం గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ..గిగా కారిడార్‌కు ప్రభుత్వం ఇస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో కలసి పని చేస్తామన్నారు. రాష్ట్రంలో మా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామన్నారు. విద్యుత్తు బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని గల్లా జయదేవ్ తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×