E-Paper
Advertisement

Telangana Speaker : గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఎన్నిక.. ఏకగ్రీవం..

Telangana Speaker :  గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఎన్నిక.. ఏకగ్రీవం..
Advertisement

Telangana Speaker : తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికయ్యారు.
స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసే సరికి ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికను గురువారం ప్రొటెం స్పీకర్‌ ప్రకటిస్తారు.

శాసన సభ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. కేటీఆర్ వచ్చి నామినేషన్ పత్రంపై సంతకం చేశారు. స్పీకర్ ఎన్నికకు ఒక్కటే నామినేషన్ రావడంతో గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

Advertisement

దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్.. రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న గడ్డం ప్రసాద్.. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్‌ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌ లలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో స్పీకర్‌ పదవిని దళిత నేతకు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×