E-Paper
Advertisement

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు
Advertisement

Formula-E Race Case: తెలంగాణలో సంచలనమైన ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫారసు చేసింది. ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు సిఫారసు

ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతించాలని ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ వీరిద్దరిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. అయితే ఈ విషయంపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలకు విజిలెన్స్ అనుమతి ఇవ్వడంతో ఫార్ములా-ఈ రేస్ కేసు మరోసారి వార్తల్లో నిలించింది. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిపై ఉత్కంఠ నెలకొంది.

బీఆర్ఎస్ హయాంలో

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్ లో ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించారు. ఈ రేస్ నిర్వహణలో విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించారని, దీంతో ప్రభుత్వానికి 54.88 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో కేటీఆర్, పలువురు ఉన్నతాధికారులపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి.

ఛార్జ్ షీట్ రెడీ చేస్తున్న ఏసీబీ

ఫార్ములా ఈ రేస్‌‌‌‌ కేసులో చర్యలకు ఏసీబీ రెడీ అవుతుంది. కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై న్యాయ విచారణకు గవర్నర్‌‌‌‌‌‌‌‌ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఛార్జ్ షీట్‌‌‌‌ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్విడ్‌‌‌‌ ప్రో కో విధానంలో ఓ సంస్థ నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌ రూ.44 కోట్ల ఎలక్టోరల్‌‌‌‌ బాండ్స్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎండీఏ నిధుల దుర్వినియోగం, ఈ కార్ రేసింగ్‌‌‌‌ నిర్వహణ ఖర్చు రూ.600 కోట్లకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఏసీబీ ఛార్జ్ షీట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అసలేంటి వివాదం?

Advertisement

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం హయాంలో బ్రిటన్‌‌‌‌కు చెందిన ఎఫ్ఈవో హైదరాబాద్‌‌‌‌లో ఫార్ములా-ఈ కార్ రేస్ 9,10,11,12 సీజన్లు నిర్వహించడానికి 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 25న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఏయూడీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్‌‌‌‌‌‌‌‌ ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలి. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 11న సీజన్‌‌‌‌ 9 నిర్వహించారు. రేసింగ్‌‌‌‌ ట్రాక్ నిర్మాణానికి హెచ్‌‌‌‌ఎండీఏ నుంచి రూ.12 కోట్ల నిధులు విడుదల చేశారు.

Also Read: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

అయితే సీజన్ 9 నిర్వహణలో ఏస్ నెక్స్ట్ జెన్‌‌‌‌కు రూ.165 కోట్లు నష్టం వచ్చింది. దీంతో మిగిలిన సీజన్ల నిర్వహణ నుంచి తప్పుకుంది. దీంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం, బ్రిటన్ ఎఫ్ఈవో, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌30న మరో నూతన ఒప్పందం జరిగింది. ఇందులో ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహణకు మొత్తంగా రూ.600 కోట్లు ఖర్చు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న గ్రీన్ కో కంపెనీ నుంచి క్విడ్ ప్రో కో రూపంలో బీఆర్ఎస్ కు రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని ఏసీబీ తన నివేదికలో తెలిపింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×