E-Paper
Advertisement

Hyderabad Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేస్.. ఒక్క రోజుకి నాలుగు కోట్లా?

Hyderabad Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేస్.. ఒక్క రోజుకి నాలుగు కోట్లా?
Advertisement

Hyderabad Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేటీఆర్ అరెస్టుపై హైకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. తీర్పు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కాకపోతే ఈ కేసులో సెక్షన్ 405, 409 గురించే వాదనలు, గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు ప్రస్తావించారు. దర్యాప్తు ప్రారంభంలో ఈ విధంగా చేయడం కరెక్టు కాదన్నది ఏసీబీ వైపు మాట.

ఫార్ములా కేసు వాదించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తరపున ఢిల్లీ నుంచి న్యాయ వాదులు వచ్చారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే. ఒక్క రోజుకు ఆయన నాలుగు కోట్ల రూపాయలు ఫీజు ఛార్జ్ చేస్తారంటూ ఢిల్లీలో చర్చించుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని కేటీఆర్ తన లాయర్‌గా పెట్టుకుంటున్నారని అంటున్నారు. తప్పు చేయనప్పుడు ఇంత ‘రిచ్‌’గా భయపడడం ఎందుకంటూ సోషల్ మీడియాలో సైటెర్లు పడిపోతున్నాయి.

Advertisement

నార్మల్‌గా అయితే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు వాదించే కేసులకు ఫీజు భారీ మొత్తంలో ఉంటాయి. కానీ ఎంత అనేది మాత్రం బయటపడదు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కారు రేసుపై చాలామంది పోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఫార్ములా రేసును భారీ ఖర్చుగా చాలా దేశాలు భావిస్తున్నాయి. కెనడా, సౌతాఫ్రికా, ఇటలీ, ఇండోనేషియా లాంటి దేశాలు దీన్ని రద్దు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. 2017 లో కెనడా ఆ తరహా రేసును రద్దు చేసింది. ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక భారమని భావించి రద్దు చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్‌రెడ్డి

2023లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ రేసు చేసుకున్నట్లు చెబుతున్నారు. భారత కరెన్సీలో దాదాపు రూ.137 కోట్లు ఖర్చు అనవసరమని దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటలీ కూడా పైకి భద్రతా కారణాలు ప్రచారం చేసినా, అసలు కారణం ఆర్థిక భారమేనని భావించి తప్పుకుందని తెలుస్తోంది. ఇండోనేషియాలో అయితే ప్రతిపక్షాల నిరసనలతో 2020-24 రేసులు రద్దు అయ్యాయి. లేకుంటే ప్రభుత్వానికి 688 కోట్ల నష్టం వచ్చేదని భావిస్తున్నాయి. ఈ విషయాన్ని అంతర్గాతీయ పత్రికలు సైతం పేర్కొన్నాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×