E-Paper
Advertisement

Ramdev Rao: లీజు పేరుతో భూకబ్జా? ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావు తీరుపై రైతుల పోరాటం

Ramdev Rao: లీజు పేరుతో భూకబ్జా? ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావు తీరుపై రైతుల పోరాటం
Advertisement

Ramdev Rao: రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామ పరిధిలోని ఎక్స్ పీరియమ్ ఎకో పార్క్ (Experium Eco Park) చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. ఈ పార్క్ యజమాని రాందేవ్ రావు తమను మోసం చేశారంటూ స్థానిక రైతులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కేవలం ఐదేళ్ల కాల పరిమితికి అని నమ్మబలికి, అక్రమంగా 99 సంవత్సరాల పాటు భూమిని లీజుకు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమ జీవితాధారమైన భూమిని లాక్కున్నారని వారు వాపోతున్నారు.

రైతుల కథనం ప్రకారం.. మొదట్లో పార్క్ అభివృద్ధి కోసం భూమిని అడిగినప్పుడు, స్వల్ప కాలానికి మాత్రమే ఒప్పందం అని చెప్పారు. కానీ, తీరా ఒప్పంద పత్రాలను పరిశీలిస్తే అవి 99 ఏళ్ల లీజుకు మార్చబడ్డాయని రైతులు గుర్తించారు. దీనిపై ప్రశ్నించిన రైతులకు లీజు పత్రాలు చూపించకపోగా, రావలసిన నగదును కూడా చెల్లించకుండా రాందేవ్ రావు కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలుకుబడితో తమ నోరు నొక్కేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Advertisement

ఈ భూ వివాదం వల్ల తమకు జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ భూములను తమకు ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూమిని ఇలా మోసపూరితంగా లాక్కోవడం వల్ల తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని, న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యే శరణ్యమని రైతులు హెచ్చరిస్తున్నారు. తమ గోడును పట్టించుకోకపోతే, అందరం కలిసి రాందేవ్ రావు పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామని వారు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ప్రకటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక వ్యాపారవేత్త స్వలాభం కోసం వందలాది ఎకరాల రైతు భూములను ఇలా ఇబ్బందుల్లోకి నెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Also Read: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. స్పాట్లో 85 మంది

ప్రస్తుతానికి ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వేడెక్కుతోంది. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ భూ లీజు ఒప్పందాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వివాదం మరింత ముదరకముందే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, మోసపోయిన రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×