E-Paper
Advertisement

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!
Advertisement

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్దమర్రి గ్రామం పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మూడుచింతలపల్లి మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి బూజు, మొలకలు వచ్చి నష్టపోతున్నట్లు తెలిపారు.

దాదాపు 20 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, వర్షం పడితే తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టడమే తమ పనిగా మారిందని రైతులు వాపోయారు. మరోవైపు పాఠశాలలు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతున్నప్పటికీ పాఠశాల ఆవరణల్లో పోసిన ధాన్యం కుప్పలు అలాగే ఉండిపోయాయని పేర్కొన్నారు.

Advertisement

అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.

Also Read: కేటీఆర్‌పై వ్యాఖ్యలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కడియం.. డాక్టర్ రాజయ్య హెచ్చరిక

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×