E-Paper
Advertisement

Farmer Suicide: పిల్లల సాక్షిగా.. సెల్ టవర్ కు ఉరేసుకున్న రైతన్న..

Farmer Suicide: పిల్లల సాక్షిగా.. సెల్ టవర్ కు ఉరేసుకున్న రైతన్న..
Advertisement

Farmer Suicide: అతను సెల్ టవర్ మీద ఉన్నాడు. ఇద్దరు చిన్నారులు డాడీ.. డాడీ.. దిగండి డాడీ.. అంటూ కింద ఏడుస్తున్నారు. ఆకాశం వైపు చూస్తూ.. అంతెత్తులో సరిగ్గా కనిపించని తండ్రిని వేడుకుంటున్నారు. ఆ చిన్నారుల మొరకు ఆ తండ్రి మనస్సు మారినట్టు లేదు. అతని పిల్లల పిలుపు.. ఆ తండ్రికి వినిపించిందో లేదో. కాసేపటికే.. సెల్ టవర్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తండ్రి. కన్నపిల్లల సాక్షిగా ప్రాణాలు వదిలిన అతని ఉదంతం కన్నీరు పెట్టిస్తోంది. కామారెడ్డి జిల్లాలో జరిగిందీ దారుణం. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే రైతు సమీపంలోని సెల్‌టవర్‌ ఎక్కి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.

అసలేం జరిగిందంటే..
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చెరువు సమీపంలోని తన భూమి మీదుగా పంట కాలువ నీరు వెళ్తుండటంతో పరిహారం చెల్లించాలని కొన్నేళ్లుగా అధికారులకు, గ్రామస్థులకు మొర పెట్టుకుంటున్నాడు ఆంజనేయులు. తన సాగు దెబ్బతింటోందంటూ బాధపడేవాడు. రెండేళ్ల క్రితం అప్పటి తహసీల్దార్‌.. అతని భూమికి 2వేలు పరిహారం ఇప్పించాడు. గత ఏడాది రైతులు ఎవరూ చెరువు కింద పంటలు సాగు చేయకపోవడంతో పరిహారం అందలేదు. ఈసారి మళ్లీ పంట సాగుకు సిద్ధమవడంతో.. మళ్లీ పంట నీళ్లు తన పొలం గుండా పోతాయంటూ మనస్తాపం చెందాడు ఆంజనేయులు.

Advertisement

తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కాడు ఆంజనేయులు. ఎమ్మార్వో, ఎస్సైలు అతనితో ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆ రైతు వినలేదు. ఎస్పీ, డీఎస్పీ ఇక్కడికి రావాలని పట్టుబట్టాడు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఎంత చెప్పినా వినకుండా.. టవల్ తో సెల్‌ టవర్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లల కళ్లముందే తండ్రి ఉరి వేసుకొని చనిపోవడం చూసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×