E-Paper
Advertisement

Examathon Run: గచ్చిబౌలిలో ఎగ్జామ్ థాన్ రన్.. విజేతలకు రూ.10 లక్షలు ప్రైజ్ మనీ

Examathon Run: గచ్చిబౌలిలో ఎగ్జామ్ థాన్ రన్.. విజేతలకు రూ.10 లక్షలు ప్రైజ్ మనీ
Advertisement

Examathon Run: గచ్చిబౌలి స్డేడియంలో ఎగ్జామ్ థాన్ రన్ మొదలైంది. కావేరీ విశ్వవిద్యాలయం, కాలేజీ మెంటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్ థాన్ రన్ ఫర్ ఢ్రీమ్స్ అనే పేరుతో 3, 5, 10 కిలోమీటర్ల విభాగంలో ఈ పరుగు చేపట్టింది. పరీక్షలకు సంబంధించిన విద్యార్ధుల ఒత్తిడిని తగ్గించడం, దృష్టి సారించి సామాజిక ఉద్యమం చేపట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మేము మీతో ఉన్నాం అనే నినాదంతో ఈ పరుగు పందెం సాగుతోంది.

మరాథాన్ మూడు విభాగాల్లో నిర్వహించనున్నారు. 3 కిలోమీటర్ల ఫన్ లేదా టైమ్డ్ రన్, 5 కిలోమీటర్ల టైమ్డ్ రన్, 10 కిలోమీటర్ల టైమ్డ్ రన్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న విజేతలకు భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. మొత్తం రూ.10 లక్షల నగదు బహుమతి వివిధ విభాగాల్లో.. గెలుపొందిన వారికి అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రైజ్ మనీతో పాటు విజేతలకు ప్రత్యేక గుర్తింపు సర్టిఫికేట్లు కూడా అందజేయనున్నారు.

Advertisement

కేవలం విజేతలకే కాకుండా, ఈ మారాథాన్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహకాలు అందించనుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ-సర్టిఫికేట్, రిఫ్రెష్‌మెంట్స్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీ-షర్ట్, మెడల్, గూడీ బ్యాగ్ వంటి బహుమతులు అందజేయనున్నారు.

Also Read: సీఎం రేవంత్ రాబందులా మారారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

పరీక్షలకు సంబంధించిన విద్యార్ధుల ఒత్తిడిని తగ్గించడం , దృష్టిసారించి, సామాజిక ఉద్యమం చేపట్టినట్లు విశ్వవిద్యాలయం ఛాన్సలర్ తెలిపారు. దాదాపు 80 నుంచి 90 శాతం భారతీయ విద్యార్ధులు పరీక్షా సంబంధిత ఒత్తిడిని ఎదుర్కుంటున్నారని చెప్పారు. విద్యార్ధుల బాధ, డ్రాప్ఔట్‌లకు విద్య ఇది ప్రధానకారణమన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్ధులకు పరీక్షా దశలలో సమిష్టి భరోసా, ఒత్తిడి లేని అభ్యాసం ప్రాముఖ్యతను ఇచ్చేందుకు ఈ పరుగును నిర్వహిస్తున్నామని తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×