E-Paper
Advertisement

Errolla Srinivas: జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాలి.. రాహుల్ గాంధీపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్!

Errolla Srinivas: జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాలి..  రాహుల్ గాంధీపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్!
Advertisement

Errolla Srinivas:  రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లన్ని డెత్ డిక్లరేషన్ లు అయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. ఎవరి ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చాడో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చిన తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ నట్టెట ముంచారన్నారు. ఏ మొహం పెట్టుకొని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చాడన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నాడనీ విద్యార్థులను , నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మొహం చూసే కదా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మలేదన్నారు. హైదరాబాద్, వరంగల్, కామారెడ్డి చేవెళ్ల డిక్లరేషన్ ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుండా? అని ప్రశ్నించారు.

Also Read: Huzurabad News: మొలంగూర్ ఖిల్లా పరిసరాల్లోని ప్రభుత్వ భూముల పరిరక్షణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి

ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం

Advertisement

భరోసా పేరుతో తెలంగాణ ప్రజలకు భరోసా లేకుండా చేశారన్నారు. ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని, అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే నిరుద్యోగుల పై లాఠీఛార్జ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడి ఇచ్చిందో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని, విద్యా భరోసా కింద విద్యార్థులకు 5 లక్షల ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అక్రమ కేసులు, నిర్బంధాలే కనిపిస్తున్నాయన్నారు. సమావేశంలో ఇంతియాజ్ అహ్మద్ ,గాంధీ నాయక్ ,బొమ్మెర రామమూర్తి ,ఫయాజ్ పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: లక్ష్యం ఒక్కటే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×