E-Paper
Advertisement

Diwali bonus: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. నేడే ఖాతాల్లో నగదు జమ

Diwali bonus: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..  నేడే ఖాతాల్లో నగదు జమ
Advertisement

Diwali bonus for Singareni employees: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సింగరేణి సంస్థలో దీపావళి బోనస్‌గా పిలవనున్న పీఎల్ఆర్ఎస్ ప్రోడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కిమ్ సింగరేణి కార్మికులకు నేడు బోనస్ చెల్లిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ రూ.358కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్‌ను ఆదేశించారు.

గతేడాది చెల్లించిన దీపావళి బోనస్ కంటే ఇది రూ.50కోట్లు అధికం కావడం విశేషం. నేడు మధ్యాహ్నంలోగా దీపావళి బోనస్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.

Advertisement

దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750 అందుకోనున్నారు. దీపావళి బోనస్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40వేల మంది కార్మికులకు వర్తించనుంది. జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్ ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంటోంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు. కాగా, ఇటీవల సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ.796కోట్ల కంపెనీ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఒక్కొక్క కార్మికుడికి సగటున లక్షా 90వేల అందాయి.దీంతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5వేల చొప్పున చెల్లించారు.

Advertisement

Also Read:  సీఎం రేవంత్ టూర్ ఫలితాలు .. ముందుకొచ్చిన కొరియా షూ కంపెనీ

అలాగే పండుగ అడ్వాన్స్ కింద ఒక్కొక్క కార్మికుడికి సగటున రూ.93,750లు లభించనున్నాయి. మొత్తం మీద ఈ నెల రోజుల వ్యవధిలో దీపావళి బోనస్, లాభాల వాటా, పండుగ అడ్వాన్స్ కింద రూ.1,250 కోట్లను కంపెనీ చెల్లించింది. ఈ విధంగా సగటున సింగరేణి ఉద్యోగులు ఈ నెల రోజుల కాలంలో ఒక్కొక్కరు సుమారు మూడు లక్షల వరకు అందుకున్నారు. బోనస్ చెల్లింపుపై తగు ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధికారులను ఆదేశించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×