E-Paper
Advertisement

TS Assembly Sessions : కోరం మెంబర్స్ పై కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వాదన.. పెళ్ళిళ్లున్నాయ్ త్వరగా కానివ్వండి..

TS Assembly Sessions : కోరం మెంబర్స్ పై కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వాదన.. పెళ్ళిళ్లున్నాయ్ త్వరగా కానివ్వండి..
Advertisement
Political news in telangana

TS Assembly Budget Sessions(Political news in telangana): ఆరవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయ్యీ అవ్వగానే.. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వాదన జరిగింది. అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు అంటే.. షార్ప్ గా 10 గంటలకు హాజరు కావాలని.. 10.05 గంటలకు, 10.10 గంటలకు కాదని అన్నారు. అలాగే సభ్యులంతా అసెంబ్లీకి వచ్చే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుదేనని పేర్కొన్నారు.

స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. అసెంబ్లీ సమావేశాలకు 12 మంది కోరం ఉంటే చాలని.. తాము 18 మంది ఉన్నామని బడ్జెట్ పై చర్చ ప్రారంభించవచ్చని తెలిపారు. కోరం లేదన్న కారణం చూపించి సభను వాయిదా వేయాలనడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సభ్యులే సభ వద్దని బయటకు వెళ్లారని మంత్రి శ్రీధర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 10 శాతం ఉండాలని చెబుతున్న మంత్రికి 18 మంది ఎక్కడ కనిపిస్తున్నారని ప్రశ్నించారు. వాళ్లు 14 మందే ఉన్నారని తెలిపారు. అసెంబ్లీని అబాసుపాలు చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, తాము పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమయంలో తాము పనికిరాని రాజకీయాలు చేయాలని అనుకోవట్లేదని పేర్కొన్నారు.

Advertisement

Read More : అసెంబ్లీలో కేసీఆర్‌ హాజరుపై ఉత్కంఠ.. ఐ డోంట్ కేర్ అంటున్న గులాబీ బాస్..

ఇంతలో మైక్ అందుకున్న దానం నాగేందర్.. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పై చర్చను త్వరగా ముగించాలని, మాకు పెళ్లిళ్లు, కార్యక్రమాలు ఉన్నాయని స్పీకర్ కు తెలిపారు. దానం నాగేందర్ చెప్పిన ఈ కారణం.. నవ్వులు తెప్పించింది. కాగా.. బడ్జెట్ పై చర్చ పూర్తయ్యాక.. కొత్త సభ్యులకు తమ నియోజకవర్గాల్లో సమస్యలను చెప్పుకునేందుకు జీరో అవర్ ఇస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. నిర్థిష్ట సమయంలోగా చర్చ పూర్తయితే.. జీరో అవర్ కేటాయిస్తామన్నారు.

Advertisement

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×