E-Paper
Advertisement

BJP : ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి కీలక నేతలు దూరం.. విభేదాలే కారణమా..?

BJP : ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి కీలక నేతలు దూరం.. విభేదాలే కారణమా..?
Advertisement

Telangana BJP latest news(Latest political news) : తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. 117 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని ప్లాన్‌ చేయగా.. ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డి, ఎంపీ సోయం బాపూరావ్‌ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఈటల, రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో కొందరు నేతలు పాల్గొనక పోవడం పెద్ద విషయమేమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఎవరి వీలును బట్టి వాళ్లు పాల్గొంటారని లైట్‌ తీసుకున్నారు.

9 ఏళ్ల మోదీ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించాలన్నదే ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం లక్ష్యం. ఒక్కో కార్యకర్త పోలింగ్‌ బూత్‌లో 10 కుటుంబాల వద్దకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు‌ బండి సంజయ్‌ కరీంనగర్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైతన్యపురి 173వ పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ప్రజల వద్దకు వెళ్లారు. 9 ఏళ్ల మోదీ పాలనపై రూపొందించిన కరపత్రాలు పంపిణీ చేశారు.

Advertisement

తెలంగాణ బీజేపీలో కొద్దిరోజులుగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో కాషాయ పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు కాంగ్రెస్ లో‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాక్టివ్‌ అయ్యారు. దీంతో ఆయన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి సైలెంట్‌ అయ్యారని అంటున్నారు. ఇక రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈటలకు కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. మరి ఈ కీలక నేతలిద్దరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×