E-Paper
Advertisement

Crop Loan Waiver: నేడే మూడో విడత రుణమాఫీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు

Crop Loan Waiver: నేడే మూడో విడత రుణమాఫీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు
Advertisement

Third Phase Rythu Runa Mafi Starts Today: రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత నేడు ప్రారంభం కానుంది. మూడో విడతగా రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణం పొందిన రైతులను రుణవిముక్తులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చింది. ఈ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించనున్నారు.

ఈ వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి మొదట రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కేటగిరీలో ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. దీంతో మూడు విడతల్లో సాగిన రుణమాఫీ ప్రక్రియ ముగియనుంది. మూడో విడతలో దాదాపు 14.45లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచానా వేస్తున్నారు.

Advertisement

ఆగస్టు 15లోగా ఏకకాలంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు నెల రోజుల కిందట రుణమాఫీ ప్రక్రియను మూడు విడతలుగా ప్రారంభించారు. మొత్తం మూడు విడతల్లో సుమారు 32.50లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు మాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

కాగా, జూలై 15వ తేదీన రుణమాఫీ జీఓను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయగా..అదే తేదిన రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. కేవలం మూడు రోజుల వ్యవధిల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రారంభించారు. జూలై 18న మొదటి విడతలో రూ.లక్ష వరకు బకాయిలు ఉన్న 11,34,412 మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ చేశారు.

Advertisement

రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ జూలై 15 తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, జూలై 18న మొదటి విడతలో రూ.లక్ష వరకు బకాయిలున్న 11,34,412 మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ చేశారు. 30న అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది. రూ.లక్ష నుంచి రూ. లక్షా50వేల వరకు ఉన్న రైతు కుంటుంబాలకు లోన్లను మాఫీ చేసింది. దాదాపు6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17,55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో సుప్రీం స్టే

రుణమాఫీకి అర్హులై ఉండి సాంకేతిక సమస్య కారణంగా రుణమాఫీ కాని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం నెలరోజుల పాటు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే సాంకేతిక సమస్య కారణంగా రుణమాఫీ రాని రైతుల పేర్ల నమోదుకు అధికారులను నియమించి సమస్యను పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెబుతున్నారు. రెండు విడతల్లో సాంకేతిక సమస్, పేర్లు, ఆధార్, ఇతర డేటా తప్పుడు నమోదుతో కొంతమందికి రుణమాఫీ కాలేదని తుమ్మల గతంలో పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×