E-Paper
Advertisement

Kunamneni Samba Shiva Rao Comments: ‘ఏపీ సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్ మీద ఎలా ఉండగలిగారు..?’

Kunamneni Samba Shiva Rao Comments: ‘ఏపీ సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్ మీద ఎలా ఉండగలిగారు..?’
Advertisement

CPI MLA Kunamneni SambaShiva Rao Comments: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ హడావుడీ నెలకొన్న విషయం తెలిసిందే. ఎక్కడా చూసినా కూడా సభలు, సమావేశాల వాతావరణం కనిపిస్తుంది. నేతల ప్రసంగాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ నియంత కంటే ప్రమాదకరి అని, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారంటూ సాంబశివరావు పేర్కొన్నారు.

మోదీ ప్రధాని అయ్యాక జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు.. అందుకే మత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? బీజేపీకి అనుకూలంగా ఉన్న నాయకులను ఒక్కరినైనా అరెస్ట్ చేశారా..? ఏపీ సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్ మీద ఎలా ఉండగలిగారు..? అంటూ ఆయన బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

రాజ్యాంగం మారుస్తామని.. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ పలువురు బీజేపీ నాయకులు అంటున్నారని ఆయన అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అలా జరగదు.. జరగనివ్వబోమంటూ ఆయన పేర్కొన్నారు. నిరంకుశ మోదీని, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో రాబోయేది ఇండియా కూటమేనంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటు కేసీఆర్ విషయమై ప్రస్తావిస్తూ కమ్యూనిస్టులను కేసీఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. ఇష్టానుసారంగా పరిపాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారన్నారు.

Also Read: ‘ఈ ఎన్నికలు తెలంగాణ – గుజరాత్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ లాంటివి’

Advertisement

నరేంద్ర మోదీ ఒక రాజులా పాలిస్తున్నారని, శ్రీలంక పరిస్థితులే దేశంలో కనిపిస్తున్నాయి.. నరేంద్ర మోదీని ప్రశ్నించకూడదా..? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోదీ మాటల గారడీతో జనాలను మోసం చేస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ఇటీవల సాంబశివరావు పేర్కొన్న విషయం విధితమే. అదేవిధంగా సింగరేణి విషయమై కూడా ఆయన మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తో సీపీఐ పార్టీ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×