E-Paper
Advertisement

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీకి కష్టాలు, ఆపై కోర్టు నోటీసు

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీకి కష్టాలు, ఆపై కోర్టు నోటీసు
Advertisement

Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు ఓ కేసులో యూపీలోని రాయ్‌బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. జ‌న‌వ‌రి 7న తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో ప్రస్తావించింది. ఇంతకీ ఈ కేసు విషయంలో అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ గెలుపొందారు. సభ్యుల ప్రమాణ స్వీకారం జూన్‌ నెలలో జరిగింది. ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎంపీగా అసరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం సందర్భంగా జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ తన ప్రమాణ స్వీకారాన్ని ముగించారు.

Advertisement

దీన్ని తప్పుబడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయవాది వీరేంద్రగుప్తా. చట్టసభలో జై పాల‌స్తీనా అనే నినాదాలు రాజ్యాంగ, న్యాయ సూత్రాల‌ను ఒవైసీ ఉల్లంఘించార‌న్నది ప్రధానంగా ప్రస్తావించారు పిటిషనర్. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఎంపీకి నోటీసులు జారీ చేసింది.

ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. జై పాలస్తీనా నినాదాలు రాజ్యాంగ విరుద్దమని మీడియా లేవనెత్తింది. అది  రాజ్యాంగానికి ఎలా వ్యతిరేకమో, అందుకు సంబంధించి నిబంధనను చూపించాలన్నారు. జై పాలస్తీనా నినాదానికి గల కారణాలు చెప్పారు.

Advertisement

ALSO READ:  అల్లు అర్జున్ ఇష్యూ.. పీసీసీకి సీఎం సూచనలు

వహా కీ ఆవామ్ మహ్రూమ్ హై (అక్కడ చాలామంది ప్రజలు నిరుపేదలు) పాలస్తీనాకు సంబంధించి మహాత్మాగాంధీ చాలా విషయాలు చెప్పారని ప్రస్తావించారు. అదే సమయంలో గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గతేడాది అక్టోబర్ నుండి దాదాపు 45 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. లక్షకు పైగానే గాయపడ్డారు. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో కనీసం 1000 మంది మరణించారని, 200 మందికి పైగా బందీలుగా తీసుకున్నారంటూ అల్ జజీరా ఛానెల్ పేర్కొన్న విషయం తెల్సిందే.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×