E-Paper
Advertisement

Congress: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా, రెండోవిడతలో అదే జోరు, కాకపోతే

Congress: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా, రెండోవిడతలో అదే జోరు, కాకపోతే
Advertisement

Congress: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మొత్తం 4,333 స్థానాల్లో సగాని కంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్‌ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు.

పంచాయితీ ఎన్నికల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా

Advertisement

బీజేపీ మద్దతుదారులకు నిర్మల్‌ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 2,297 , బీఆర్ఎస్ 1,191 , బీజేపీ 257 , ఇతరులు 578 సర్పంచ్‌ స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సీపీఎం మద్దతుదారులు 33 చోట్ల, సీపీఐ బలపరిచినవారు 28 చోట్ల గెలిచారు. మొదటి విడతలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 2,425 చోట్ల, బీఆర్ఎస్ 1,168, బీజేపీ 189, ఇతరులు 448 చోట్ల గెలుపొందారు.

రెండో విడతలో 85.86 శాతం పోలింగ్ నమోదు

Advertisement

రెండో విడతలో కూడా ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు. ఉదయం నుంచే బారులు తీరారు. రెండో విడతలో 85.86 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28 శాతం మంది ఓటేశారు. రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72 శాతం పోలింగ్‌ నమోదైంది.

మరోవైపు నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచింది. అటు నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, ములుగు ,మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నారాయణపేటలోనూ ఇదే కొనసాగింది.

Also Read:బీజేపీకి కొత్త బాస్ వచ్చేసినట్టేనా? నితిన్ నబీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక?

గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కూడా హస్తం పార్టీ హవా చూపించింది. సిద్దిపేట, కుమురంభీం, జనగామ జిల్లాల్లో బీఆర్ఎస్‌ దూసుకుపోయింది. ఈ మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులే అధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే బీజేపీ మాత్రం నిర్మల్‌ జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×