E-Paper
Advertisement

Congress Mla Srinivas reddy : కేటీఆర్ ఇటలీ నీళ్లు తాగొచ్చు కానీ పేదలు మంచినీళ్లు తాగొద్దా : యెన్నం

Congress Mla Srinivas reddy : కేటీఆర్ ఇటలీ నీళ్లు తాగొచ్చు కానీ పేదలు మంచినీళ్లు తాగొద్దా : యెన్నం
Advertisement

మూసీ నదీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ కావాలనే రాద్ధాంతం చేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. మూసీ కలుషితం వల్ల చుట్టు పక్కల ఉన్న బోర్‌ వాటర్‌ కూడా తీవ్రంగా కలుషితమైందని, అందుకే మూసీ రివర్ బెడ్ పరిసరాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

మూసీ చుట్టు పక్కన నివాసం ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్‌ ఉన్నట్లు తేలిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బాధలు ఎలా ఉంటాయో తనకు కూడా తెలుసని, తాను కూడా అలాంటి చోట్లనే నివాసం ఉన్నానన్నారు.

Advertisement

Also Read : మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని కేసీఆర్ ఆదేశించలేదా?: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వడం ప్రభుత్వం తప్ప అని ప్రతిపక్షాలను నిలదీశారు. మూసీ, హైడ్రాపై బీఆర్ఎస్ అగ్రనేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

కేసీఆర్‌ చేయలేని పనిని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని, దాన్ని ఆ పార్టీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ కట్టుకుని సకల సౌకర్యాలతో ఉండొచ్చని, ఇటలీ నుంచి నీళ్లు తెప్పించుకుని తాగుతున్నాడని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కానీ పేదలు మాత్రం గుక్కెడు మంచినీళ్లు తాగొద్దా అని ప్రశ్నించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×