E-Paper
Advertisement

Hanumanthurao: రాజకీయ డ్రామాలొద్దు.. ఆ రెండు పార్టీలకు వీహెచ్ సూచన

Hanumanthurao: రాజకీయ డ్రామాలొద్దు.. ఆ రెండు పార్టీలకు వీహెచ్ సూచన
Advertisement

VHanumanthurao: బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల వ్యవహారశైలిపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు. ఆ రెండు పార్టీలు శవాల మీద పేలాలు ఎరుకునే రకంగా వర్ణించారు. ఇప్పటికైన రాజకీయ డ్రామాలు ఆపాలని ఆ రెండు పార్టీలకు హితవు పలికారు.

బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టాలని ఎవరు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. పుష్ప 2 సినిమా టికెట్ రేటును స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పెంచారని, దీనిపై అల్లు అర్జున్ ఒక్కసారి ఆలోచించాలన్నారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం జరిగిన పరిణామాలను పొలిటికల్ పార్టీలు ఎంత సేపటికీ రాజకీయ కక్ష అని అంటున్నాయని గుర్తు చేశారు.

Advertisement

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కక్ష సాధింపు చర్య అని అన్నారని వివరించారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, మణిపూర్‌లో 90 మంది చనిపోయారని, అక్కడ లా ఆర్డర్ లేదన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని, తప్పొద్దనే కారణంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ఎంపీ సునీల్‌దత్ తన కొడుకు సంజయ్ దత్ విషయంలో చేసిన తప్పును అంగీకరించారని, అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా ఈ విషయంలో మరోసారి ఆలోచించాలన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలు యాదగిరిగుట్ట స్వామి ఉండిలో వేయాలన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×